జూబ్లీహిల్స్‏లోని తెలుగు సినీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Mythri Movie Makers -Pvt ltd)  ఆఫీసుపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు చేస్తోందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై దాడులు చేస్తున్నారని మరికొంత మంది అంటున్నారు.

జూబ్లీహిల్స్‏లోని తెలుగు సినీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Mythri Movie Makers -Pvt ltd) ఆఫీసుపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు చేస్తోందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‏పై దాడులు చేస్తున్నారని మరికొంత మంది అంటున్నారు.సూపర్ హిట్ మూవీ 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‏ను తెరకెక్కించే పనిలో ఉన్న డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక జూబ్లీహిల్స్‏లోని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రమోటర్స్‏తోపాటు యెర్నేని నవీన్(Naveen Yerneni), యలమంచిలి రవిశంకర్(Yalamanchili Ravi Shankar) ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్ పాల్పడినట్టు ఈడీకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే ప్రమోటర్లకు విదేశాల్లోని ఎన్‏ఆర్ఐలతో వ్యాపార లింకులు ఉన్నాయంటున్నారు. అయితే గత డిసెంబర్‏లో మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్‏ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించారని, ఐటీ రిటర్స్న్‏లో తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపించింది ఐటీ శాఖ.

Updated On 19 April 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story