నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెరమీద కనిపించి 50 ఏళ్లు అవుతోంది.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెరమీద కనిపించి 50 ఏళ్లు అవుతోంది. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నందుకు బాలయ్యకు టాలీవుడ్‌ సముచిత సత్కారం చేయనుంది. స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించింది. అయితే బాలకృష్ణ 50 ఏళ్ల ఫంక్షన్‌కు అతిథులను పిలిచే బాధ్యతను నందమూరి రామకృష్ణ తీసుకున్నారు. ఆయనకు ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. హరికృష్ణ కొడుకులు ఎన్టీఆర్‌(NTR), కల్యాణ్‌రామ్‌లను(Kalyan Ram) పిలిచే బాధ్యతను కూడా రామకృష్ణకే అప్పగించారు. రామకృష్ణ వారిని పిలిచారా, పిలిస్తే ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు వేడుకకు హాజరవుతారా అన్నది ఇంకా తేలలేదు. నిర్వాహకులు కూడ ఇదే మాట చెబుతున్నారు. ఆ మధ్యన సీనియర్ ఎన్టీఆర్ శతజ‌యంతి వేడుకలకు ఎన్టీఆర్‌ హాజరుకాలేదు. సిటీలో లేకపోవడం వల్లే తాను హాజరవ్వలేకపోయానని తర్వాత ఎన్టీఆర్‌ చెప్పాడు. మరి ఇప్పుడు వస్తాడో రాడో తెలియదు. ఎవరెవరిన పిలవాలి? ఎవరిని అవాయిడ్‌ చేయాలి అన్నది రామకృష్ణకే వదిలేశారట! నందమూరి ఫ్యామిలీ అంతా బాలకృష్ణ ఇంటికి చేరుకుని, అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ఒకే బస్సులో వెళ్లాలన్నది ప్లాన్‌. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జునకు ఆహ్వానం అందింది కానీ, ఆయన వస్తారో రారో ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు. నాగార్జున ప్రస్తుతం ఎన్ కన్వెషన్ వ్యవహరాల్లో వున్నారు కాబట్టి ఆయన వచ్చేది డౌటేనని అంటున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ కు నాగ చైతన్యను పంపించారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కేంద్రంలో వున్న తెలుగు మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు హాజరుకాబోతున్నారట! తుమ్మల నాగేశ్వరరావు జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన హాజరుకాకపోవచ్చని చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story