బాలీవుడ్(Bollywood) బ్యూటిఫుల్ అండ్ సీనియర్ కపుల్ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan). 20 ఏళ్లుగా ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్న ఈ జంట త్వరలో వీడాకులు తీసుకోబోతున్నారంటూ న్యూస్ వైరల్(Viral News) అవుతోంది. ఇందులో నిజం ఎంత...?
హీరోయిన్ గా బాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యారాయ్. బాలీవుడ్ తో పాటు తమిళ సినిమాల్లో(Tamil Movies) మెరిసే ఈ బ్యూటీ.. 2007 లో కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. అమితాబచ్చన్(Amitabh Bachchan) తనయుడు..

బాలీవుడ్(Bollywood) బ్యూటిఫుల్ అండ్ సీనియర్ కపుల్ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan). 20 ఏళ్లుగా ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్న ఈ జంట త్వరలో వీడాకులు తీసుకోబోతున్నారంటూ న్యూస్ వైరల్(Viral News) అవుతోంది. ఇందులో నిజం ఎంత...?

హీరోయిన్ గా బాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యారాయ్. బాలీవుడ్ తో పాటు తమిళ సినిమాల్లో(Tamil Movies) మెరిసే ఈ బ్యూటీ.. 2007 లో కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. అమితాబచ్చన్(Amitabh Bachchan) తనయుడు.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడింది. వీరికి 2012 కూతురు పుట్టగా.. ఆరాధ్య(Aaradhya) అనిపేరు పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక ఇదంతా బాగానే ఉంది కాని.. వీరి పెళ్ళి జరిగిన ఇన్నాళ్లకు ఇద్దరు స్టార్లు విడాకులు తీసుకోబోతున్నారంటూ..రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఈ వార్తలు ఎందుకు స్ప్రెడ్ అయ్యాయి.

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్​ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్. ఫిల్మ్ కెరీర్ పరంగా ఇద్దరూ స్టార్ డమ్ ను చూశారు. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయారు. ఇద్దరిలో చూసుకుంటే,ఐశ్వర్యరాయ్ ఎక్కువ స్టార్ డమ్ చూశారు. ఆమె అందానికి కోట్లలో అభిమానులు ఉన్నరు. ఇక సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా.. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈమధ్య కాస్త దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి ఎక్కడా ఎక్కువగా కనిపించడం లేదు.

గతంలో.. ఏ పార్టీ జరిగినా..ఏ ఫంక్షన్ జరిగినా.. ఎక్కడ ఏ కార్యక్రమాలు, వేడుకలు, జరిగినా.. సినిమా ఫంక్షన్లకు కూడా ఇద్దరు జంటగా వచ్చేవారు. ఐశ్వర్య ఎప్పుడూ.. భర్త అభిషేక్​తో కలసి పార్టీస్పేట్ చేసేవారు. కాని ఎందుకో ఈమధ్య మాత్రం.. ఆమె ఒంటరిగానే వెళ్తుంది. లేదంటే తన కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్తుంది. అభిషేక్ తో మాత్రం కనిపించడం లేదు.

రీసెంట్​గా ముంబై(mumbai)లో జరిగిన ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్​(Cultural Centre Launch Event)కు కూడా ఐశ్వర్యరాయ్..తన కూతురు.. ఆరాధ్యతో కలిసే వెళ్లారు. వీరితో అభిషేక్ బచ్చన్ మాత్రం కనిపించలేదు. ఈ ఒక్క కార్యక్రమం అనే కాదు, చాలా సందర్భాల్లో ఐశ్వర్యారాయ్ వెంట భర్త అభిషేక్ కనిపించడం లేదు ఈధ్య. ఇలా ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో అందరికి డౌట్ మొదలయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఐశ్వర్యకు అభిషేక్​తో ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated On 7 April 2023 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story