ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers)లో రెండు రోజులుగా ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. సినీ నిర్మాణ సంస్థ ఆస్తులపై ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ(Income Tax) ఆరాలు తీస్తోంది. సినిమాలతో వచ్చిన లాభాలతో హైదరాబాద్‌(Hyderabad) చుట్టుపక్కల భూములు కొన్నట్టు, ఆస్తులు కూడబెట్టినట్టు ఐటీ శాఖ గుర్తించింది. శంకర్‌పల్లి(Shankarpalle), మొయినాబాద్‌(Moinabad)లలో భారీగా ఆస్తులు కొన్నట్టు ఐటీ సోదాల్లో తెలిసింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers)లో రెండు రోజులుగా ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. సినీ నిర్మాణ సంస్థ ఆస్తులపై ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ(Income Tax) ఆరాలు తీస్తోంది. సినిమాలతో వచ్చిన లాభాలతో హైదరాబాద్‌(Hyderabad) చుట్టుపక్కల భూములు కొన్నట్టు, ఆస్తులు కూడబెట్టినట్టు ఐటీ శాఖ గుర్తించింది. శంకర్‌పల్లి(Shankarpalle), మొయినాబాద్‌(Moinabad)లలో భారీగా ఆస్తులు కొన్నట్టు ఐటీ సోదాల్లో తెలిసింది. దర్శకుడు సుకుమార్‌(Director Sukumar) ఇంట్లోనూ రెండోరోజు సోదాలు జరుగుతున్నాయి. దర్శకుడిగా స్థిరపడిపోయిన తర్వాత సుకుమార్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌(Sukumar Production House)ను కూడా స్టార్ట్‌ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈయన కూడా సినిమాల్లో వచ్చిన లాభాలతో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నట్టు ఐటీ శాఖ గుర్తించింది.

మైత్రీ మూవీస్‌ సంస్థలో పని చేసే ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు ఐటీ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలు అందించినందుకు సోదాలు నిర్వహించారట! మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థ ఇప్పటికే భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసింది. పుష్ఫ -2 ను కూడా 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తోంద. శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీస్‌ ప్రస్థానం మొదలయ్యింది. మొదటి సినిమానే బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. తర్వాత జనతా గ్యారేజ్‌, రంగస్థలం వంటి సినిమాలు తీసి బ్యానర్‌ ప్రతిష్టను పెంచుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పటికీ ఉప్పెన, పుష్ఫ, సర్కారువారి పాట వంటి సినిమాలతో పేరు ప్రతిష్టలను గడించింది. మొన్న సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు మైత్రీ సంస్థ నుంచి వచ్చినవే! ఇదిలా ఉంటే మైత్రీ సంస్థపై ఐటీ దాడులతో చిత్రసీమ ఉలిక్కిపడింది. ఐటీ దాడుల కారణంగా అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'పుష్ప 2' షూటింగ్‌ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో ఖుషి సినిమాలు కూడా మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్నవే!

Updated On 20 April 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story