2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్‏లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ నభా నటేష్ . ఆ సినిమాలో ఆమె నటన, అందానికి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో ఓ చెరగని ముద్ర వేసుకుంది ఈ భామ. 2020లో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’లో సాయిధరమ్ తేజ సరసన నటించింది. ఆ తర్వాత రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ నటించింది. ఇక ఆతర్వాత స్టార్ […]

2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్‏లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ నభా నటేష్ . ఆ సినిమాలో ఆమె నటన, అందానికి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో ఓ చెరగని ముద్ర వేసుకుంది ఈ భామ. 2020లో వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’లో సాయిధరమ్ తేజ సరసన నటించింది. ఆ తర్వాత రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ నటించింది.

ఇక ఆతర్వాత స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు వస్తున్న టైమ్‏లో రోడ్ యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు కాస్త దూరం అయింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఆమె ఈ మధ్యనే కోలుకుంది. తనకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా తెలిపి ఫ్యాన్స్‏ను షాక్‏కి గురి చేసింది.

ఆ కారణంగానే కొంతకాలంగా మూవీస్ చేయలేదని, ఆ టైమ్‏లో చనిపోతానేమో అనే అంత భయం వేసిందని నభా నటేష్ చెప్పింది. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి సంవత్సరం పట్టిందని, ప్రస్తుతం అంతా నార్మల్‏గానే ఉందని చెప్పింది. ప్రమాదం తర్వాత తన భుజం ఎముక విరిగిందని, అందుకు చాలా సర్జరీలు కూడా చేయాల్సి వచ్చిందని అభిమానులతో చెప్పుకుంది.

‘‘యాక్సిడెంట్ వలన చాలా ఛాన్సులు పోయాయని, అయినా వాటి కోసం ఎప్పుడూ బాధపడలేదు. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైంది అని.. నాది అనుకున్నది ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందని నమ్ముతాను’’ అని చెప్పింది. ఒకప్పుడు సోషల్ మీడియాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్నని, ఇప్పుడు సోషల్ మీడియాలో లాస్ట్ ప్లేస్‏లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇదంతా యాక్సిడెంట్‏తోనే జరిగిందని భావోద్వేగానికి గురైంది.

ప్రస్తుతం నభా నటేష్‏కు తెలుగులో సినిమా అవకాశాలు తగ్గాయి. ఫస్ట్‏లో వరుసగా ఛాన్స్‏లు అందుకున్న ఈ భామకు ఇప్పుడు ఒక్క అవకాశం కూడా రాకుండాపోతోంది. ఇక ఈమెకు అవకాశాలు వస్తాయోలేదో చూడాలి మరి.

Updated On 7 March 2023 6:27 AM GMT
Ehatv

Ehatv

Next Story