దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన యానిమల్‌ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. సినిమా విడుదలై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే 500 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను సాధిచింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్ర అభిమానుల భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 1వ తేదీన విడుదలయ్యింది. బ్లాక్‌బస్టర్‌ హిట్టయ్యింది. దర్శకుడు సందీప్‌రెడ్డిపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన యానిమల్‌ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. సినిమా విడుదలై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే 500 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను సాధిచింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్ర అభిమానుల భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 1వ తేదీన విడుదలయ్యింది. బ్లాక్‌బస్టర్‌ హిట్టయ్యింది. దర్శకుడు సందీప్‌రెడ్డిపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్ర దర్శకుడిని విపరీతంగా పొగిడేశారు. సినిమాపై ప్రత్యేకంగా రివ్యూ కూడా ఇచ్చాడు. లేటెస్ట్‌గా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఈ చిత్రాన్ని తెగ మెచ్చుకున్నారు. ఈ సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ అని, బ్రిలియెన్స్‌ అని, అద్భుతమని అన్నారు. భారతీయ సినిమాను రణ్‌బీర్‌ కపూర్ సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని, స్ఫూర్తిదాయకంగా నిలిచారని మెచ్చుకున్నారు. రష్మిక మందన్నా నటన బ్రిలియంట్ అని, అత్యుత్తమ నటన కనబరిచిందని కితాబిచ్చాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ గొప్పగా నటించారన్నారు. మరో నటి త్రిప్రి డిమ్రీ నటనతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిందన్నారు. యానిమల్ టీమ్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇక దర్శకుడు సందీప్‌రెడ్డి గురించి చెబుతూ ' మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది' అని అన్నారు. ఇండియన్‌ క్లాసిక్‌ సినిమాల లిస్ట్‌లో యానిమల్ కూడా కచ్చితంగా ఉంటుందని ట్వీట్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 8 Dec 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story