తమిళ స్టార్‌ హీరో అజిత్‌(Ajith) సినిమా రాక చాన్నాళ్లవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ ఎందుకో ఏడాది నుంచి నటించడం లేదు. తుణివు సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. తెలుగులో దీనిని తెగింపు(thegimpu) పేరిట డబ్ చేసి విడుదల చేశారు. ఆ తర్వాత ఓ సినిమా అయితే ప్లాన్‌ చేశారు కానీ దానికి సవాలక్ష ఇబ్బందులు వస్తున్నాయి.

తమిళ స్టార్‌ హీరో అజిత్‌(Ajith) సినిమా రాక చాన్నాళ్లవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ ఎందుకో ఏడాది నుంచి నటించడం లేదు. తుణివు సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. తెలుగులో దీనిని తెగింపు(thegimpu) పేరిట డబ్ చేసి విడుదల చేశారు. ఆ తర్వాత ఓ సినిమా అయితే ప్లాన్‌ చేశారు కానీ దానికి సవాలక్ష ఇబ్బందులు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోయే సినిమాకు అజిత్‌కు సైన్‌ చేశారు. దానికి విడాముయిర్చి(Vidamuyirchi) అనే పేరు కూడా పెట్టారు. ఇప్పటికీ ఆ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లలేదు. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా విఘ్నేశ్‌ శివన్‌ను అనుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయనను తొలగించారు. ఆ తర్వాత దర్శకుడు మగిళ్‌ తిరుమేణికి ఆ బాధ్యతలను అప్పగించారు.

దర్శకుడు కూడా ఖరారయ్యాడు కాబట్టి షూటింగ్ మొదలపెట్టడమే తరువాయి అని అనుకున్నారంతా. అయితే విడాముయిర్చి సినిమాకు మాత్రం ఇప్పటి వరకు మంచి ముహూర్తం దొరకలేదు. అజిత్ బైక్‌ మీద విదేశీ ప్రయాణానికి వెళ్లడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే అజిత్‌ చిత్రం ఆగిపోలేదని, త్వరలోనే మొదలవుతుందని నిర్మాత సుభాస్కరన్‌(Subhaskaran) ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో అజిత్‌ సరసన త్రిష నటిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. తర్వాత ఆమె కూడా తప్పుకున్నారు. త్రిష స్థానంలో మలయాళ నటి మంజు వారియర్‌ను తీసుకోవాలనుకుంటున్నారనే వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇక ఇప్పుడేమో బాలీవుడ్‌ భామ హ్యుమా ఖురేషీని(Huma Qureshi) తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్‌. ఈమె ఇంతకు ముందు అజిత్‌తో కలిసి వలిమై సినిమాలో నటించారు.

Updated On 4 Sep 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story