విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తో దర్శకుడు పరశురామ్‌ రూపొందించిన గీత గోవిందం(Geetha Govindam)సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌కు గట్టి పునాది పడింది కూడా ఆ సినిమాతోనే అన్నది కాదనలేని సత్యం. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్‌ రెండు సినిమాలను ఒప్పుకున్నారు.

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తో దర్శకుడు పరశురామ్‌ రూపొందించిన గీత గోవిందం(Geetha Govindam)సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌కు గట్టి పునాది పడింది కూడా ఆ సినిమాతోనే అన్నది కాదనలేని సత్యం. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్‌ రెండు సినిమాలను ఒప్పుకున్నారు. అందులో ఒకటి పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండకు జోడిగా సీతారామం ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్ట్‌ నచ్చడంతో మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో విజయ్‌ పక్కన పూజాహెడ్గే నటించాల్సి ఉంది. ఆమెను ఎంపిక చేసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆ ప్లేస్‌లో ఇప్పుడు మృణాల్‌ను తీసుకున్నారు. సీతారామం సినిమాతో మృణాల్‌ బాగా పాపులరయ్యారు. ఆ సినిమాలో పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నాని సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇక విజయ్‌ దేవరకొండ సినిమా విషయానికి వస్తే గీత గోవిందం తరహాలో సాగే రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతున్నది.. ఈ వారంలో లాంఛనంగా మొదలు కానున్న ఈ సినిమా.. జులై నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Updated On 14 Jun 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story