బుల్లితెరపై కలర్స్‌ ప్రొగ్రామ్‌తో పాపులరైన నటి స్వాతి(Colours Swathi). సరదా మాటలతో ప్రేక్షకులను అలరించి ఇంటిపేరును కలర్స్‌గా మార్చుకున్న స్వాతి తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా నటించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేశ్‌కు మరదలిగా, త్రిష చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

బుల్లితెరపై కలర్స్‌ ప్రొగ్రామ్‌తో పాపులరైన నటి స్వాతి(Colours Swathi). సరదా మాటలతో ప్రేక్షకులను అలరించి ఇంటిపేరును కలర్స్‌గా మార్చుకున్న స్వాతి తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా నటించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేశ్‌కు మరదలిగా, త్రిష చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నాచురల్‌స్టార్‌ నాని నటించిన అష్టాచమ్మాలో స్వాతి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. నంది అవార్డు కూడా ఆమెను వరించింది. లేటెస్ట్‌గా స్వాతి గురించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా రోజుల నుంచి స్వాతి తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటున్నారన్నది ఆ వార్త సారాంశం. ఈ ప్రచారం జరగడానికి కారణం తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి స్వాతి తొలగించడమేనని అంటున్నారు. గతంలో సమంత కూడా నాగచైతన్యతో విడిపోతున్నప్పుడు ఇలాగే తన సోషల్‌ మీడియా ఖాతాల్లోంచి అక్కినేని అనే ఇంటిపేరును తొలగించారు. తర్వాత నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను తొలగించారు. ఇటీవల విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య విషయంలో కూడా సేమ్‌ టు సేమ్‌ ఇలాగే జరిగింది.
ఇవన్నీ చూస్తే తన భర్తతో స్వాతి కూడా విడాకులు తీసుకోబోతున్నారని అంటున్నారు. తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు కాబట్టి విడిపోవడం ఖాయమని కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ కూడా ప్రచారం చేస్తున్నాయి. స్వామి విషయంలో ఇలాంటి ప్రచారం జరగడం ఇది మొదటి సారి కాదు. రెండేళ్ల కిందట కూడా ఇలాంటి కథనాలు చాలా వచ్చాయి. అప్పుడు కూడా స్వాతి క్లారిటీ ఇచ్చుకున్నారు. భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని చెబుతూ తన ఫోన్‌లో ఉన్న ఫోటోలను చూపించారు. అంతే కాదు ఆ ఫోటలన్నింటినీ ఓ వీడియోగా రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో అప్పుడు విడాకుల వదంతులకు పుల్‌స్టాప్‌ పడింది. ఇప్పుడు మళ్లీ స్వాతి విషయంలో అదే ప్రచారం జరుగుతోంది. స్వాతి పెళ్లి 2018లో మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్‌ వాసుతో జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత దంపతులు థాయ్‌లాండ్‌లో సెటిల్‌ అయ్యారు. అప్పట్లో సినిమాలకు కాసింత విరామం ఇచ్చిన స్వాతి 2019లో త్రిసూర్‌పురం అనే మలయాళ సినిమాలో నటించారు. తెలుగులో కూడా పంచతంత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ హైదరాబాద్‌లోనే స్వాతి ఉంటున్నారని, భర్త మాత్రం థాయ్‌లాండ్‌లోనే ఉంటున్నారని చెబుతున్నారు. ఇందులో వాస్తవమేమిటో తెలియదు. ఈ కథనాలపై స్వాతి రియాక్టయితే కానీ నిజం తెలియదు.

Updated On 18 July 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story