ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడిన హీరో విశాల్ ఆంధ్రాలో మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారని

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫీవర్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం రకరకాల సర్వేలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీని ఓడించాలని టీడీపీ-జనసేన-బీజేపీ పోటీ పడుతూ ఉన్నాయి. తప్పకుండా తామే మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఎలాగైనా అడ్డుకుంటామని కూటమి నాయకులు అంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాల్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడిన హీరో విశాల్ ఆంధ్రాలో మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారని, అలాగే జగన్‌పై దాడికి కూడా కుట్ర జరుగుతోందని అన్నారు. ఇలాంటి దాడులకు జగన్ భయపడరని కూడా తేలిపోయిందన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని, ఇకపై జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నానన్నారు. తాను వైసీపీ పార్టీకి ఎప్పుడూ మద్దతు ప్రకటించలేదని, జగన్ అంటే తనకు ప్రత్యేక అభిమానం మాత్రం ఉందని విశాల్ అన్నారు. ముఖ్యంగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం జగన్ ఎదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటోందని.. ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి సీఎం చేయడం మామూలు విషయం కాదని విశాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ సీఎం జగన్ గెలుస్తారని అన్నారు.

విశాల్ రత్నం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. త్వరలో తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు.రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నారని అన్నారు. సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని, ఎక్కడో ఏసీ రూమ్‌లో కూర్చొని పాలిటిక్స్ చేయలేమని అన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరచిపోవాలన్నారు.

Updated On 16 April 2024 9:53 PM GMT
Yagnik

Yagnik

Next Story