లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayantara) ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉన్నారు. షారూక్‌ఖాన్‌తో(Shah Rukh Khan) కలిసి హిందీలో నటించిన జవాన్‌(Jawan) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో కూడా ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. నటుడు విశాల్‌(Vishal) తాజాగా నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని(Mark Antony). ఇందులో రీతూ వర్మ(Rithu Varma) హీరోయిన్‌గా నటించారు.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayantara) ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉన్నారు. షారూక్‌ఖాన్‌తో(Shah Rukh Khan) కలిసి హిందీలో నటించిన జవాన్‌(Jawan) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో కూడా ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. నటుడు విశాల్‌(Vishal) తాజాగా నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని(Mark Antony). ఇందులో రీతూ వర్మ(Rithu Varma) హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ దర్శక, నటుడు ఎస్‌జే సూర్య(SJ Surya) విలన్‌గా నటించారు. మన సునీల్‌(Sunil) కూడా ఇందులో కనిపిస్తారు. దర్శకుడు సెల్వ రాఘవన్(Selva Raghavan) ఇందులో ప్రధానభూమికను పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించగా, అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మినీ స్టూడియోస్‌ బ్యానర్‌పై వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అవుతున్నాయి.

వినాయకచవితి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విశాల్‌ను సందర్భం కాకపోయినా ఓ విలేకరి నయనతార గురించిన ప్రశ్నను అడిగారు. ఈ సినిమాకు నయనతారకు సంబంధం లేకపోయినా నయనతార చిత్ర కార్యక్రమాలలో పాల్గొనక పోవడానికి కారణం ఏమిటని అడిగారు. దానికి విశాల్‌ చాలా తెలివిగా జవాబిచ్చారు. నయనతార ఏ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని, అది ఆమె వ్యక్తిగత హక్కు అని చెప్పారు. తప్పనిసరిగా పాల్గొనాలని ఆమెను నిర్బంధం చేయలేమని విశాల్‌ చెప్పారు. తనకు ఇష్టం లేదని చెబితే ఆమెను మనం ఏమీ చేయలేమన్నారు. అయితే ఆమె వస్తే బాగుంటుందని తెలిపారు. చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలలో పాల్గొనడం తప్పేమీ కాదని విశాల్‌ అన్నారు. మరి నయనతార ఇప్పట్నుంచి చిత్రప్రమోషన్లకు

Updated On 29 July 2023 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story