తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమా తుప్పరివాళన్‌.. తెలుగులో 'డిటెక్టివ్' గా వచ్చిన చిత్రానికి సీక్వెల్‌ను హీరో విశాల్‌

తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమా తుప్పరివాళన్‌.. తెలుగులో 'డిటెక్టివ్' గా వచ్చిన చిత్రానికి సీక్వెల్‌ను హీరో విశాల్‌ ప్రకటించారు. డిటెక్టివ్ సినిమా 2017 లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించారు, కానీ ఇప్పుడు డిటెక్టివ్ చిత్రానికి సీక్వెల్ విషయంలో మాత్రం విశాల్ దర్శకత్వం వహించబోతున్నారు. దర్శకత్వం వహించడం తనకు ఒక కల అని.. 25 ఏళ్ల తర్వాత డిటెక్టివ్ 2తో అది నిజం కానుందని విశాల్ తెలిపాడు. డిటెక్టివ్ ని రూపొందించినందుకు హీరో విశాల్ దర్శకుడు మిస్కిన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సినిమా కారణంగా ఇప్పుడు సీక్వెల్ కి దర్శకత్వం వహించబోతున్నానని తెలిపారు. అతను తన తండ్రి, జి.కె. రెడ్డి, నటుడు అర్జున్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్, అజర్‌బైజాన్, మాల్టాలో ఉంటుందని.. షూటింగ్ కోసం తాను ఇప్పటికే అక్కడికి చేరుకున్నానని విశాల్ వెల్లడించారు. విశాల్ ఇటీవలి చిత్రం మార్క్ ఆంటోనీ తమిళం, తెలుగు రెండింటిలోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది, బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. విశాల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. మార్క్ ఆంటోనీలో SJ సూర్య, సునీల్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్వరలో రత్నం సినిమాతో విశాల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

Updated On 17 March 2024 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story