తమిళ హీరో శింబు(Shimbu) తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కకుంటూ ఉంటారు. తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్న శింబుపై విమర్శలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అసలు శింబుకు వివాదాలకు అవినావభావ సంబంధం ఉందేమో! ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. లేటెస్ట్‌గా నిర్మాత ఐసరి గణేశ్(Aisari Ganesh) కూడా శింబుపై కంప్లయింట్‌ చేశారు.

తమిళ హీరో శింబు(Shimbu) తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కకుంటూ ఉంటారు. తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్న శింబుపై విమర్శలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అసలు శింబుకు వివాదాలకు అవినావభావ సంబంధం ఉందేమో! ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. లేటెస్ట్‌గా నిర్మాత ఐసరి గణేశ్(Aisari Ganesh) కూడా శింబుపై కంప్లయింట్‌ చేశారు. తాను నిర్మించనున్న కరోనా కుమార్ సినిమాలో నటించడానికి కమిట్ అయిన శింబుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన సినిమాలో నటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన సినిమాను పూర్తి చేసే వరకు థగ్‌ లైఫ్‌ సినిమాలో శింబు నటించకుండా నిషేధం విధించాలని కోరారు. దీంతో శింబుపై రెడ్ కార్డ్(Red Card) విధించినట్లు పరిశ్రమలో ప్రచారం జరిగింది. దీనిపై శింబు రియాక్టయ్యారు. తాను కమలహాసన్‌(Kamal Haasan), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్‌లో వస్తున్న థగ్ లైఫ్ లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడతానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు

Updated On 5 Jun 2024 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story