సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఆమె అభిమానులందరూ ముద్దుగా శామ్ అని పిలుచుకుంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఆమె ఫ్యాన్స్‏తోపాటు అందరికీ ఆమె ఓ జెస్సీ. 2010 నాటి నుంచి కొంత కాలం వరకు ప్రేమలో ఉన్న బాయ్స్ అందరికీ.. వాళ్ల వాళ్ల గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఒక జెస్సీ. ఒక మూడు నాలుగేళ్ల కాలం వరకు ఆమె జెస్సీగానే అందరికీ పరిచయం.

సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఆమె అభిమానులందరూ ముద్దుగా సామ్ అని పిలుచుకుంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఆమె ఫ్యాన్స్‏తోపాటు అందరికీ ఆమె ఓ జెస్సీ. 2010 నాటి నుంచి కొంత కాలం వరకు ప్రేమలో ఉన్న బాయ్స్ అందరికీ.. వాళ్ల వాళ్ల గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఒక జెస్సీ. ఒక మూడు నాలుగేళ్ల కాలం వరకు ఆమె జెస్సీగానే అందరికీ పరిచయం. 1987 తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఈమె.. తన పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ అండ్ అలాగే ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ చదువుకుంది. ఈ బ్యూటీ కెరీర్ తొలి నాళ్లలో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 2007లో డైరెక్టర్ రవి వర్మన్ (Ravi Varman) చేస్తున్న మాస్కోవిన్ కావేరి అనే చిత్రంలో నటించే అవకాశం దక్కింది ఆమెకు. ఆ చిత్రం చేస్తున్నప్పటికీ ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తుందట. ఆ తర్వాత 2010లో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon)చిత్రం 'ఏ మాయ చేశావే'తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ.

ఆ ఒక్క సినిమాతో కాదు.. కాదు.. తన నటనతో తెలుగు ఆడియన్స్ గుండెలో ఓ స్థానాన్నిఏర్పరుచుకుంది మన సామ్. 'ఏం మాయ చేశావే' చిత్రానికి ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్, బెస్ట్ యాక్టర్ అవార్డ్, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ తోపాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. రెండు మూడేళ్లపాటు 'ఏం మాయ చేశావే' ఫీవర్ ప్రేక్షకుల్లో అలా ఉండిపోయింది. ఆ చిత్రం తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సరసన నటించే అవకాశం దక్కించుకుంది సామ్. 'బృందావనం' చిత్రంలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రంలో ఇందు క్యారెక్టర్‏తో తెలుగు ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh babu) సరసన 'దూకుడు' చిత్రం, న్యాచురల్ స్టార్ నాని సరసన 'ఈగ' చిత్రాల్లో నటించిన తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్‏గా నిలదొక్కుకుంది సమంత. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు బాక్సీఫీసు దగ్గర పెద్దగా ఆడకపోయినా.. తన స్టార్ డమ్‏తో నెట్టుకొచ్చింది. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‏లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో మళ్లీ ఫామ్‏లోకి వచ్చింది ఈ బ్యూటీ. సరిగ్గా వన్ ఇయర్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ చిత్రం 'మనం'తో సమంత ప్రేక్షకులను అలరించింది.

అయితే ఆ చిత్రం కంటే ముందు నుంచే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ. 'మనం' సినిమా తర్వాత ఈ భామ నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ కూడా ఒచ్చాయి. ఓపెన్‏గా చెప్పాలంటే మనం చిత్రంలో వీరిద్దరి రొమాన్స్ కూడా ఫ్యామిలీ లానే కనిపించిందని ఆ మధ్య గాసిప్స్ బాగానే వినిపించాయి. 'మనం' చిత్రం తర్వాత అంటే రెండేళ్లు గడిచాక.. సూర్య(Suriya)తో 24 సినిమా చేస్తున్న టైమ్‏లో సమంత ప్రేమలో ఉందన్న వార్తలు బాగా జోరందుకున్నాయి. నాగచైతన్య, సమంతలు ఇద్దరు కలిసి పార్టీలు, పబ్బులు, మాల్స్‏లో తిరగడం, ఫొటోలు లీక్ అవడంతో వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని బలంగా నమ్మారు ఆడియన్స్. ఇక వీళ్ల లవ్ ఎఫెయిర్ పబ్లిక్ అవడంతో 2017 అక్టోబర్ 6,7 తేదీల్లో గోవాలో సమంత-నాగచైతన్య హిందు, క్రిస్టియన్ సాంప్రదాయా ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కపుల్స్‏గా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు వరుస సినిమాలతో మంచి ఫామ్ ఉన్నారు. సమంత-నాగచైతన్య మూడుపుళ్ల బంధానికి నాలుగేళ్ల తర్వాత ముగింపు (Divorce) పలికారు.. అంటే 2021 అక్టోబర్ 2న ఇద్దరు వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

వీరిద్దరు డివోర్స్ తర్వాత సమంత చాలా గ్యాప్ తీసుకుని 2022లో 'యశోద' చిత్రంతో ఈ బ్యూటీ మళ్లీ ప్రేక్షకుల ముందు ఒచ్చింది. ఆ చిత్రం మినిమమ్ హిట్ టాక్‏ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి సమంత కెరీర్ కాస్త డౌన్ ఫాల్ అయింది. ఆమె కెరీర్ 'మనం' సినిమాకు ముందు ఆ తర్వాత అన్నట్టు అయింది. ఆ సినిమా సమయంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది. దీంతో సమంతపై ఆడియన్స్ తమ ప్రేమను చూపించారు. దాంతో యశోద చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వెంటనే గుణ శేఖర్ డైరెక్షన్‏లో సమంత ఓ సినిమాకు సైన్ చేసింది. గుణశేఖర్ (Gunasekhar) చిత్రంపైన సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది. 'శాకుంతలం' (Shaakuntalam) చిత్రం డిజాస్టర్ అవడంతో సమంత కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. ఓ వైపు సినిమాలు సరిగ్గా లేకపోవడం.. మరోవైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్డ్స్‏గా లేకపోవడంతో ఆమె మెంటల్ డిస్టబెన్స్‏ను చూసింది. ఆమె ఈ బాధ నుంచి కోలుకుందామనే సమయంలో చై వేరే అమ్మాయితో డేటింగ్‏లో ఉన్నాడనే ప్రశ్నలు రావడంతో మరింత డిప్రెషన్‏లోకి వెళ్లినట్టు అయింది.

ఒకానొక సందర్భంలో మీ మాజీ భర్త పలాన అమ్మాయితో డేటింగ్ అని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. "ఎవరు రిలేషన్‏షిప్‏లో ఉన్నా.. ఎవరితో రిలేషన్‏షిప్ ఉన్నా.. నేను పట్టించుకోవడం లేదు.. బాధపడటం లేదు" అని తన బాధని తెలిపింది. ప్రేమ విలువలు తెలియని వాళ్ళు ఎంత మందితో డేటింగ్ చేసినా ఏం ఉపయోగం అంటూ సమంత కన్నీటి పర్యాంతమైంది. అతను తన ప్రవర్తన మార్చుకుని ఆ అమ్మాయినైనా బాధ పెట్టకుండా చూసుకుంటే అందరికీ మంచిదే కదా అని చెప్పింది. మరోవైపు కెరీర్ పరంగా ఎవరితోనైనా కలిసి పని చేయాలనుకుంటున్నారా, ఏదైనా డ్రీమ్ ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. 'కెరీర్ (Career)‏లో ఇంత దూరం వరకు వస్తానని కలలో కూడా ఊహించలేదని' సమాధానం చెప్పింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ఏ సినిమా చేసినా.. అవి పెద్దగా పాజిటివ్ వ్యూస్ రాకపోయినా.. ఆమె అభిమానుల్లో మాత్రం పాజిటివ్ ముద్ర వేసుకుంది. తాజాగా ఓ అభిమాని ఆమెకు గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. బాపట్ల జిల్లా ఆలపాడులోని ఓ యువకుడు సమంత మయోసైటిస్ నుంచి కోలుకుందని.. ఆమె పేరు మీద తిరుపతి, చెన్నై దేవాలయాలను సందర్శించి.. ఆమెకు గుడి కట్టిస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా ఒకొనొక టైమ్ ఇండస్ట్రీని ఊపేసిన ఈ బ్యూటీకి విడాకుల తర్వాత ఆమె జీవితం రివర్స్ అయిపోయింది. 2020లో 'జాను' సినిమా తర్వాత మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. తన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్‏ను చూస్తోంది.. రీసెంట్‏గా 'శాకుంతలం' డిజాస్టర్ తర్వాత మానసికంగా పోరాడేందుకు ఫైట్ చేస్తోంది. సమంత ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జనాల నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఈ స్టార్ బ్యూటీ నెక్ట్స్ చేయబో ప్రాజెక్టులు పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలని.. ఆమె మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలని కోరుతూ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu)కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఈహా న్యూస్, వెబ్ సైట్.. వన్స్ ఎగెయిన్ హ్యాపీ బర్త్ డే జెస్సీ.

Updated On 28 April 2023 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story