హీరో మహేష్ బాబుకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గుంటూరు కారం మూవీ(Guntur karam movie) టికెట్ ధరల పెంపున(Increase ticket prices)కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్(Telangana Govt green signal) ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)-టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కాంబినేషన్ లో రూపొందిన ఈ లేటెస్ట్ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో మహేష్ బాబుకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గుంటూరు కారం మూవీ(Guntur karam movie) టికెట్ ధరల పెంపున(Increase ticket prices)కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్(Telangana Govt green signal) ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)-టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కాంబినేషన్ లో రూపొందిన ఈ లేటెస్ట్ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విడుదల పనుల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది. అయితే తాజాగా 'గుంటూరు కారం' మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

నైజాం ప్రాంతంలో గుంటూరు కారం చిత్రాన్ని విడుదల చేస్తున్న శ్రీవెంకటేశ్వర ఫిల్మ్స్(Srivenkateswara Films) సంస్థ టికెట్ ధరల పెంపు, బెన్ ఫిట్ షోతోపాటు అదనపు ఆటలకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూవీ యూనిట్ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ఈమేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 18 వరకు వారం రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే ఉదయం 4 గంటల ఆటతో ఆరో షోను వేసుకోవచ్చు అంటూ సూచించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట నుంచి గుంటూరు కారం బెన్ ఫిట్ షోలను థియేటర్లలో వేసుకునే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated On 9 Jan 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story