రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమా మొదలు కాబోతోందని

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమా మొదలు కాబోతోందని తెలియగానే చిత్ర పరిశ్రమలో ఓ హాట్ టాపిక్ నడిచింది. ఈ సినిమాలో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్డేట్స్ రావడానికి కూడా చాలా కాలం పడుతూ ఉంది. జరగండి సాంగ్ వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం ఫస్ట్ గ్లిమ్ప్స్ ఏమైనా ఇస్తారా.. లేక టీజర్ ను విడుదల చేస్తారా అని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందించారు. ఎన్నికల సమయంలో గేమ్ ఛేంజర్ టీమ్ నుండి కనీసం మెసేజ్ అయినా వస్తుందని అభిమానులు ఆశించారు. దురదృష్టవశాత్తు ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. గేమ్ ఛేంజర్ టీమ్ తమ ప్లానింగ్‌తో అభిమానులను నిరాశపరుస్తూనే ఉంది. ఇక సినిమా విడుదల తేదీ గురించి అభిమానులకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఈ ఏడాదిలో విడుదల అవుతుందా లేక వచ్చే ఏడాదికి వస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది.

Updated On 13 May 2024 11:02 PM GMT
Yagnik

Yagnik

Next Story