సింగర్ మంగ్లీ(Singer Mangli) ప్రయాణిస్తున్న కారును డీసీఈఎం ఢీకొట్టిన(Accident) సంఘటన రంగారెడ్డి(Ranga reddy) జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది.

సింగర్ మంగ్లీ(Singer Mangli) ప్రయాణిస్తున్న కారును డీసీఈఎం ఢీకొట్టిన(Accident) సంఘటన రంగారెడ్డి(Ranga reddy) జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంగ్లీ హాజరై అర్థరాత్రి మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొండుపల్లి గ్రామ శివారులో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆమె కారును వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. మంగ్లీకి స్వల్ప గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసిఎం కర్నాటక రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది.

Updated On 18 March 2024 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story