ఏపీ(AP)లో వచ్చే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ(Telangana), దక్షిణ ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh), ఒడిశా(disha) మీదుగా రాయలసీమ నుంచి దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Weather Station) తెలిపింది.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story