ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్

డబుల్ ఇస్మార్ట్.. 2024, ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తో వారంలోనే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడొచ్చు. ఎందుకంటే ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

2019లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ మూవీ రొటీన్‌గా సాగిందని, కొత్తగా కథా కథనం ఏం లేవని తేలిపోయింది. పూరీ జగన్నాథ్ మార్క్ కూడా సినిమాలో పెద్దగా లేకపోవడంతో డబుల్ ఇస్మార్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని షాక్ తగిలింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సెప్టెంబర్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. హిందీ వెర్షన్ కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story