తాను ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. తన మిత్రుడు త్రివిక్రమ్ మాత్రం తన గురించి ఆలోచించే వాడని

తెలుగు సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు. జల్సా (2008), అత్తారింటికి దారేది (2013) వంటి క్లాసిక్‌లను పవన్ కళ్యాణ్ కు అందించాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందనుకోండి. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో త్రివిక్రమ్ ఒకరు అని అందరికీ తెలిసిందే. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, ప్రముఖ నటుడు త్రివిక్రమ్ గురించి కొన్ని మరపురాని మాటలు మాట్లాడారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలు వంటి కష్ట సమయాల్లో త్రివిక్రమ్ తనకు అండగా నిలిచారని పవన్ కళ్యాణ్ అన్నారు.

వకీల్ సాబ్ (2021), భీమ్లా నాయక్ (2022), బ్రో (2023) స్క్రిప్ట్‌లను చేయాల్సిందేనని త్రివిక్రమ్ తనను పట్టుబట్టాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. తన మిత్రుడు త్రివిక్రమ్ మాత్రం తన గురించి ఆలోచించే వాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన కోసం ప్రత్యేకంగా స్క్రిప్టులు రాసి, సినిమాలు తెచ్చి పెట్టాడన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ అసలు ఇష్టం లేదన్నారు. ఆయన మాట వినకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అయినప్పటికీ త్రివిక్రమ్ తనను భరిస్తూనే ఉన్నాడన్నారు. నన్ను నా కుటుంబం, నా రక్తం ఎంత అర్థం చేసుకుందో తెలియదు కానీ.. ఎక్కడెక్కడో ఉన్న వారు నన్ను చాలా అబిమానిస్తారు.. అర్థం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Updated On 14 March 2024 8:33 PM GMT
Yagnik

Yagnik

Next Story