తెలుగులో సత్యం, ధన51, రాజుభాయ్‌ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు సూర్యకిరణ్‌(Surya kiran) చెన్నైలో(Chennai) కన్నుమూశాడు. కామెర్ల(Jhondis) బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం.

తెలుగులో సత్యం, ధన51, రాజుభాయ్‌ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు సూర్యకిరణ్‌(Surya kiran) చెన్నైలో(Chennai) కన్నుమూశాడు. కామెర్ల(jaundice) బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. మాస్టర్‌ సురేశ్‌ పేరుతో 200లకుపైగా చిత్రాలలో బాల నటుడిగా నటించిన సూర్య కుమార్‌ పెద్దయ్యాక సహాయ నటుడిగా కొన్ని చిత్రాలలో నటించారు. తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగారు. హీరోయిన్‌ కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్యకిరణ్‌. అయితే వీరి వివాహబంధం చాన్నాళ్లు నిలువలేదు. మరస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. బాలనటుడిగా రెండు జాతీయ అవార్డులను అందుకున్న సూర్యకిరణ్‌ దర్శకుడిగా రెండు నంది అవార్డులను గెల్చుకున్నాడు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరుగుతాయి.

Updated On 11 March 2024 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story