సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinkanth) హీరోగా జైలర్‌(jailer) సినిమా మొన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. మొదటి షో నుంచే హిట్‌ట టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో కలెక్షన్లను కూడా కుమ్మేస్తోంది. రజనీకాంత్‌కు కమ్‌బ్యాక్‌ సినిమాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌కు(Nelson Dilip Kumar) అయితే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార(Nayantara) ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల(Komalavu kokila) సినిమాతో దర్శకుడయ్యారు నెల్సన్‌. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinkanth) హీరోగా జైలర్‌(jailer) సినిమా మొన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. మొదటి షో నుంచే హిట్‌ట టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో కలెక్షన్లను కూడా కుమ్మేస్తోంది. రజనీకాంత్‌కు కమ్‌బ్యాక్‌ సినిమాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌కు(Nelson Dilip Kumar) అయితే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార(Nayantara) ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల(Komalavu kokila) సినిమాతో దర్శకుడయ్యారు నెల్సన్‌. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది.

ఆ తర్వాత శివ కార్తికేయన్‌(shiva Karthikeyan) హీరోగా డాక్టర్‌(Doctor) అనే సినిమాను తీశారు. ఈ సినిమా కూడా బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అటు పిమ్మట దళపతి విజయ్‌(Vijay Thalapathy)హీరోగా బీస్ట్‌(Beast) అనే సినిమా తీశారు. దీనికి మాత్రం మిశ్రమ స్పందన లభించింది. కాకపోతే ఈ సినిమా కూడా రెండు వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. అసలు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌కు వేట్లై మన్నన్‌ అనే సినిమా మొదటి చిత్రం కావాల్సి ఉండింది. శింబు హీరోగా ఆ సినిమాను మొదలు పెట్టారు నెల్సన్‌.

ఇందులో నటి హన్సిక(Hansika) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా కొంత భాగం షూటింగులు జరుపుకుంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే జైలర్‌ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్‌ తన తొలి చిత్రం వేట్టై మన్నన్‌(Vettai Mannan) కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయమై నటుడు శింబు(Shimbu) దర్శకుడు నెల్సన్‌ను సంప్రదించారట. ఒకవేళ సినిమా పూర్తి చేయాలనుకుంటే హీరోయిన్‌ హన్సిక్‌ సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

శింబు-హన్సిక లవ్‌ ఎపిసోడ్‌ ఈ సినిమాకు అడ్డంకిగా మారే ఛాన్సు ఉంది. శింబు-హన్సికలు అప్పట్లో తెగ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేంత వరకు వీరి ప్రేమ వెళ్లింది. చివరలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక హీరోయిన్‌గా నటించిన ఆమె 50వ చిత్రం మహాల్‌లో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్‌ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్న అనుమానమే చాలా మందికి కలుగుతోంది. ఇదిలా ఉంటే, నెల్సన్‌ తదుపరి సినిమాను ధనుష్‌తో చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి నెల్సన్‌ ఇప్పుడు వేట్లై మన్నన్‌ను పూర్తి చేస్తారా? లేక ధనుష్‌తో సినిమా చేస్తారా? అన్నది తేలాలంటే కొన్ని రోజులు ఆగాలి.

Updated On 12 Aug 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story