టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) అల్లుడు అర్చిత్‌ రెడ్డికి(Archith Reddy) చెందిన కారు(thief) దొంగతనానికి గురయ్యింది. కోటి 70 లక్షల రూపాయల పోర్షే కారు(Porsche) కనిపించకుండా పోవడంతో కంగారుపడ్డారు అర్చిత్‌రెడ్డి. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు అర్చిత్‌రెడ్డి.

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) అల్లుడు అర్చిత్‌ రెడ్డికి(Archith Reddy) చెందిన కారు(thief) దొంగతనానికి గురయ్యింది. కోటి 70 లక్షల రూపాయల పోర్షే కారు(Porsche) కనిపించకుండా పోవడంతో కంగారుపడ్డారు అర్చిత్‌రెడ్డి. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు అర్చిత్‌రెడ్డి. అక్కడ తన కారును పార్క్‌ చేసి లోపలికి వెళ్లారు. అరగంట తర్వాత బయటకు వచ్చి చూస్తే కారు కనిపించలేదు. వెంటనే ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు(Jubliehills Police) కంప్లయింట్‌ చేశారు. సీఐ వీరశేఖర్‌, ఎస్సై రాజశేఖర్‌లు రంగంలోకి దిగారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను వారు అలెర్ట్‌ చేయడంతో కారు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన వ్యక్తి చెప్పిన వివరాలు పోలీసులకు షాక్‌నిచ్చాయి. తాను ఆకాశ్‌ అంబానీ(Akash ambani) వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR) కారు తీసుకెళ్లాలని సూచించారని, అందుకే కారును తీసుకెళుతున్నట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. అక్కడితే అతడు చెప్పడం ఆపలేదు. తన సహాయకుడు హృతిక్‌ రోషన్‌తో(Hrithik Roshan) కలసి అత్యవసరంగా అకాశ్‌ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని, అంచేత తనను వెంటనే వదిలేయాలని పోలీసులతో చెప్పుకొచ్చాడు. కంగుతిన్న పోలీసులు తలలుపట్టుకున్నారు. కాసేపయ్యాక అతడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేశారు. అతడికి మతిస్థిమితం లేదని, బ్రైట్‌ లైఫ్‌ ఫౌండేషన్‌లో(Bright Life Foundation) చికిత్స తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంక్వైరీలో అది నిజమేనని తేలింది. నిందితుడు పేరు మల్లెల సాయికిరణ్‌ అట! మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన వాడట!

Updated On 14 Oct 2023 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story