బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న చిత్రం ‘యానిమల్’(Animal). అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా(Sandeep Reddy Vanga) ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్(Bollyood) కి వెళ్లి ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశాడు అంతే. ఆ త‌ర్వాత రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ ను ప‌ట్టాలెక్కించాడు.

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ చిత్రం మీద అంచనాలు ఒక రేంజిలో ఉండడంతో తెలుగు హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్‌లో దిల్ రాజు చాలా ఏళ్లుగా అగ్ర నిర్మాతగా ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాక కూడా ఇండస్ట్రీలో తనని నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్ ని వదులుకోలేదు. ఓ వైపు సొంతంగా భారీ సినిమాలని నిర్మిస్తూ ఉన్నా.. డిస్ట్రిబ్యూషన్‌లో కూడా బిజీగా ఉన్నారు.

Updated On 24 Sep 2023 8:16 AM GMT
Yagnik

Yagnik

Next Story