విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల నటుడు నాగ చైతన్య(Naga Chaitanya) ఓ సినిమాకు వెళ్లాడట! ఇంట్రెల్వెల్‌ సమయలో ఖుషి సినిమా ట్రైలర్‌ను చూపించారట! ట్రైలర్‌ అలా మొదలయ్యిందో లేదో నాగార్జున(Nagarjuna) బయటకు వచ్చేశారని సోషల్‌ మీడియాలో కథలు కథలుగా వచ్చింది. కొన్ని యూ ట్యూబ్‌ ఛానెళ్లు అయితే విచిత్రమైన థంబ్‌నైల్‌తో కథనాలు వండి వార్చాయి. ఈ వదంతులపై నాగచైతన్య రియాక్టయ్యారు. అవన్నీ చెత్త వార్తలనీ, అందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో వచ్చిన వదంతులు తన దృష్టికి వచ్చాయని, వాటిని సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించామని నాగచైతన్య తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య- సమంతలు 2021లో తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తాము అధికారికంగా విడాకులు తీసుకుననామని నాగ చైతన్యనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతున్నామని, సమంత ప్రియమైన వ్యక్తి అని, ఆమె జీవితం సంతోషంగా సాగాలని నాగ చైతన్య ఆకాంక్షించారు.

Updated On 28 Aug 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story