అజిత్ కుమార్‌కి సర్జరీ జరిగిందని షాకింగ్ రిపోర్టులు కూడా వచ్చాయి

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. ఆయన రొటీన్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లారు.. అజిత్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారని, మరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన ప్రతినిధి మీడియాకు తెలియజేశారు.

అయితే అజిత్ కుమార్‌కి సర్జరీ జరిగిందని షాకింగ్ రిపోర్టులు కూడా వచ్చాయి. 4 గంటల పాటు శస్త్రచికిత్స చేసి అతని మెదడులోని కణితిని వైద్యులు తొలగించారు. మదురై, కేరళకు చెందిన ప్రఖ్యాత సర్జన్లు ఈ ఆపరేషన్ చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల విశ్వసనీయత ఇంకా తెలియరాలేదు. నటుడి ప్రతినిధి లేదా ఆసుపత్రి యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు ఇప్పుడు అజిత్ కుమార్ క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్.. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన రేసీ యాక్షన్ థ్రిల్లర్ 'విదాముయార్చి' సినిమా చేస్తున్నారు.

Updated On 8 March 2024 1:45 AM GMT
Yagnik

Yagnik

Next Story