బోదై ఏరి బుద్ది మారి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన దుషారా విజయన్‌ అదృష్టం బాగుండి దర్శకుడు పా.రంజిత్‌(Ranjith) దృష్టిలో పడ్డారు. ఆయన నిర్వహించిన ఆడిషన్‌లో ఎంపిక అయ్యారు. సార్పట్టా పరంపరై(Sarpatta Paramparai) సినిమాలో హీరోయిన్‌ వేషాన్ని సంపాదించుకున్నారు.

బోదై ఏరి బుద్ది మారి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన దుషారా విజయన్‌(Dhushara Vijayan) అదృష్టం బాగుండి దర్శకుడు పా.రంజిత్‌(Ranjith) దృష్టిలో పడ్డారు. ఆయన నిర్వహించిన ఆడిషన్‌లో ఎంపిక అయ్యారు. సార్పట్టా పరంపరై(Sarpatta Paramparai) సినిమాలో హీరోయిన్‌ వేషాన్ని సంపాదించుకున్నారు. అందులో హీరో ఆర్యకు(Arya) జంటగా మరియమ్మ పాత్రలో జీవించారు. ఓ ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతిగా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌ తీసిన నక్షత్రం నగర్గిరదు సినిమాలో నటించారు. అందులోనూ చాలా గొప్పగా నటించారు దుషారా. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి వంటి సినిమాలతో పాటు అర్జున్‌దాస్‌ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుళ్‌నిధి హీరోగా వస్తున్న కళువేత్తి మూర్కన్‌(Kaluvethi Murkan) సినిమా ఆల్‌మోస్టాల్‌ కంప్లీట్‌ అయ్యింది.

ఈ నెల 26న విడుదల కాబోతున్నది. ఎస్‌. అంబేత్‌ కుమార్‌(Ambet Kumar) నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్‌ రాజ్‌ డైరెక్టర్‌. కళువేత్తి మూర్కన్‌ తనకు స్పెషల్‌ సినిమా అని దుషారా విజయన్ అన్నారు. అరుళ్‌ నిధితో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ అని అన్నారు. ఆయన సెట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని, ఈ సినిమాలో తాను ఇందులో కవిత అనే బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో నటించానని దుషారా తెలిపారు. అరుళ్‌ నిధితో కలిసి నటించిన రొమాన్స్‌ సన్నివేశాలు డిఫరెంట్‌గా ఉంటాయన్నారు. దర్శకుడు పా.రంజిత్‌ సార్పట్టా పరంపరైకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే అందులో కూడా తానే నటిస్తానని తెలిపారు. తన ఫిల్మీ కెరీర్‌ సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలా ఉందని, అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని దుషారా విజయన్‌ తెలిపారు.

Updated On 22 May 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story