దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కలిశారు. ఇద్దరు కలిసి హ్యాపీగా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఈమధ్య టాలీవుడ్‌(Tollywood)లో దేవిశ్రీ ప్రసాద్ జోరు తగ్గింది. మెగా హీరోలకు మాత్రం దేవి మ్యూజిక్ ఎక్కువగా ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్న దేవిశ్రీ.. సడెన్ గా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బాస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశాడు.

దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కలిశారు. ఇద్దరు కలిసి హ్యాపీగా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

ఈమధ్య టాలీవుడ్‌(Tollywood)లో దేవిశ్రీ ప్రసాద్ జోరు తగ్గింది. మెగా హీరోలకు మాత్రం దేవి మ్యూజిక్ ఎక్కువగా ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్న దేవిశ్రీ.. సడెన్ గా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బాస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫొటో షేర్ చేశాడు డీఎస్పీ. అయితే ఈ ఫోటో కి ఓ స్పెషల్ ఉంది. ఈ ఫోటో తీసింది మెగాస్టార్ ధర్మపత్ని సురేఖ.

ఈపోస్ట్ కు ఓ చిన్న ట్యాగ్ కూడా రాశారు దేవిశ్రీ. మధురమైన బ్రేక్‌ఫాస్ట్‌, అద్భుతమైన సమయం. మేము ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకు ఎప్పుడూ చాలా చాలా ప్రత్యేకం. లవ్‌ యూ సార్‌. ఇలాంటి అందమైన ఫొటో తీసిన సురేఖ గారికి ధన్యవాదాలు..బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు డీఎస్పీ. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను ఇంకా వైరల్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటీ అంటే.. ఇంతకీ ఈ ఇద్దరు ఎందుకు కలిశారు. దీని వెనుకు ఉన్న సీక్రెట్‌ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడు జనాలు. ఫ్యాన్స్ కూడా ఆ సీక్రెట్‌ ఏంటో చెప్పండంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలుసు. మరి ఇద్దరు కలిసి నెక్ట్స్ ఇంకేదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

డీఎస్పీ మరి చిరంజీవితో కొత్త సినిమా గురించి ఏదైనా చర్చించాడనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది . చిరంజీవి ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతన్ భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌ సింగ్, అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబోలో వస్తున్న పుష్ప.. ది రూల్‌కు సంగీతం మ్యూజిక్ చేస్తున్నారు.

Updated On 23 April 2023 10:21 PM GMT
Ehatv

Ehatv

Next Story