‘ఆస్కార్’ అవార్డ్స్ అనగానే ప్రతీ ఒక్కరు ఎప్పుడు.. ఎప్పుడు.. అని ఆసక్తిగా అడుగుతారు.. ఎదురు చూస్తారు కూడా. అయితే ‘2023 ఆస్కార్’ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా అని ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలా కాకుండా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కూడా ఆస్కార్ అవార్డ్స్ పై ఫోకస్ పెట్టారు. ఇండియా నుంచి డాక్యుమెంటరీలు అలాగే సినిమాలు కూడా ఆస్కార్ కి సెలెక్టయ్యాయి. అందులోనూ మన తెలుగు సినిమా RRR నుంచి ‘నాటు నాటు’ సాంగ్ […]

‘ఆస్కార్’ అవార్డ్స్ అనగానే ప్రతీ ఒక్కరు ఎప్పుడు.. ఎప్పుడు.. అని ఆసక్తిగా అడుగుతారు.. ఎదురు చూస్తారు కూడా. అయితే ‘2023 ఆస్కార్’ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా అని ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలా కాకుండా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కూడా ఆస్కార్ అవార్డ్స్ పై ఫోకస్ పెట్టారు. ఇండియా నుంచి డాక్యుమెంటరీలు అలాగే సినిమాలు కూడా ఆస్కార్ కి సెలెక్టయ్యాయి.

అందులోనూ మన తెలుగు సినిమా RRR నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయినప్పటి నుంచి టాలీవుడ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అండ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల నటనే ఈ అవార్డు రాబోతుండటానికి కారణం. ఈ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు.

సినిమా అవార్డుల్లో గొప్పగా చెప్పుకునే అవార్డు అంటే అది ‘ఆస్కారే’. ఈ అవార్డు సాధించాలని చాలా మంది డైరెక్టర్ల తపనపడుతుంటారు. ఆ అదృష్టం కొంతమందికే వరిస్తుంది. ఇదిలా ఉంటే 2023 ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కోసం అందరూ ఎదురుచూస్తున్న టైమ్ లో ఇండియాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ ఈవెంట్ లో అవార్డ్స్ ప్రెజెంట్ చేస్తున్న సెలబ్రిటీల జాబితాలో మన బ్యూటీ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే పేరును చేర్చింది ది అకాడమి.

అయితే 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంట్స్ చేస్తున్న నేమ్స్ బయటికి రాగా.. వాటిలో ఇండియా నుంచి దీపికి పదుకొనే ఒకరుగా ఉన్నారు. ఇండియా నుంచి దీపికకు మాత్రమే ఈ ఛాన్స్ దొరికింది. అవార్డ్స్ ప్రెజెంటర్స్ లిస్టులో రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, జెనీఫర్ కొనేలీ, అరియానా డిబోస్, శామ్యూల్ జాక్సన్, మైఖెల్ బి జోర్దాన్, ట్రాయ్ కొట్సూర్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ అవార్డ్స్ కార్యక్రమం మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనుంది.

ఈ అవార్డ్స్ ప్రెజెంటర్స్ లిస్టులో తను ఉన్నట్టు దీపికా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ఆస్కార్ ఈవెంట్ పై మిమ్మల్ని చూడటం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. దీపిక పదుకొనేకు వచ్చిన ఛాన్స్ పట్ల ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ప్యాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ Kలో దీపిక పదుకొనే నటించబోతుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

Updated On 3 March 2023 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story