బాహుబలి(Bahubali) సినిమా తర్వాత ప్రభాస్‌(Prabhas) నేషనల్‌ స్టార్‌ అయ్యారు. దేశమంతటా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. పాన్‌ ఇండియా హీరో అంటే ప్రభాసే అన్నంతా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సెట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ కే(Project K) సినిమా తర్వాత హాలీవుడ్‌ హీరో అయినా ఆశ్చర్యపడనక్కర్లేదట. ఈ మాటన్నది ప్రముఖ నిర్మాత అశ్వినిదత్‌(Aswini Dutt). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాహుబలి(Bahubali) సినిమా తర్వాత ప్రభాస్‌(Prabhas) నేషనల్‌ స్టార్‌ అయ్యారు. దేశమంతటా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. పాన్‌ ఇండియా హీరో అంటే ప్రభాసే అన్నంతా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సెట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ కే(Project K) సినిమా తర్వాత హాలీవుడ్‌ హీరో అయినా ఆశ్చర్యపడనక్కర్లేదట. ఈ మాటన్నది ప్రముఖ నిర్మాత అశ్వినిదత్‌(Aswini Dutt). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెడుతున్న సినిమా ఇదేనట. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక పదుకొణే హీరోయన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ముందు నుంచి ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రూపొందిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు తయారు చేస్తున్నారు. ఇటీవలే రీ ఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఒక్క టైరు కోసం చిత్ర యూనిట్‌ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ టైర్‌ సాయంతోనే ప్రభాస్‌ టైమ్‌ ట్రావెల్‌ చేస్తారట. ప్రభాస్‌ కూడా ఈ సినిమా కోసం చల కష్టపడుతున్నారు. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌. అయితే ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం అనుమానమేనని అంటున్నారు. సోమవారం రవితేజ సినిమా ఈగల్‌ పోస్టర్‌ విడుదలయ్యింది. ఇందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్‌ మీడియా బ్యానర్‌ సంస్థ నిర్మిస్తోంది. పీపుల్‌ మీడియా ప్రభాస్‌కు చాలా క్లోజ్‌. ఈ సంస్థ ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమాను నిర్మిస్తుంది కూడా. అంతేనా ఆదిపురుష్‌ సినిమా హక్కులను కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కుంది. దీంతో పాటు ప్రభాస్‌ త్వరలో నటించబోతున్న స్పిరిట్‌ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నది. ఇలా మూడు సినిమాలను టేకోవర్‌ చేసి ప్రభాస్‌కు చాలా దగ్గరయ్యింది పీపుల్ మీడియా. ప్రాజెక్ట్ కే సినిమా సంక్రాంతికి రాద‌ని తెలుసుకున్న తర్వాతే పీపుల్‌ మీడియా వారు ఈగల్‌ను సంక్రాంతికి షెడ్యూల్ చేసుకున్నారట. అయితే ఇందులో వాస్తవమెంతో తెలియదు. ఇదిలాఉంటే ప్రాజెక్ట్‌ కే కోసం మ్యూజిక్‌ వర్క్‌ను సంతోష్‌ నారాయణన్‌ మొదలు పెట్టారు. సై-ఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ అమితాజ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Updated On 13 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story