ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూశారు

ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శనివారం ఉదయం తెల్లవారుజామున 4:50 కు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

రామోజీరావు మృతి పట్ల సంతాప సూచికగా సినిమా షూటింగ్‌లకు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ సెలవు ప్రకటించారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయాన్ని ఉంచారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Updated On 8 Jun 2024 2:06 AM GMT
Yagnik

Yagnik

Next Story