ఒకప్పుడు స్టార్ గా ఎదిగి.. ఇండస్ట్రీలో రాజకీయాలకు బలైపోయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరు రాకేష్ మాస్టర్. రీసెంట్ గా జూన్ 18 ఆదివారం నాడు ఆయన సడెన్ గా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. రాకేష్ మాస్టార్ మరణం టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. అంతే కాదు ఆయన మరణంపై కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంతో ఇంతకు ముందు ఆయన కూతురు కూడా వెల్లడించింది.

మీడియాపై మండిపడ్డాడు దివంగత స్టార్ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ తనయుడు. తన తండ్రి మరణించడానికి కారణం మీరే అంటూ మీడియాను నిందించడమే కాకుండా.. ఇక మా జోలికి రాకండంటూ వేడుకున్నాడు.

ఒకప్పుడు స్టార్ గా ఎదిగి.. ఇండస్ట్రీలో రాజకీయాలకు బలైపోయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరు రాకేష్ మాస్టర్. రీసెంట్ గా జూన్ 18 ఆదివారం నాడు ఆయన సడెన్ గా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. రాకేష్ మాస్టార్ మరణం టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. అంతే కాదు ఆయన మరణంపై కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంతో ఇంతకు ముందు ఆయన కూతురు కూడా వెల్లడించింది. తాజాగా రాకేష్ మాస్టర్ తనయుడు కూడా తన తండ్రి మరణంపై ఘాటుగా స్పందించాడు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండంటున్నాడు.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్లతో రాకేష్ మాస్టర్ ది ప్రత్యేక స్థాయి. ఆయన దాదాపుగా 1500 కి పైగా సినిమాలకి కొరియోగ్రఫీ చేశారు. మరీ ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. ఇప్పుుడ స్టార్లుగా ఎదిగిన వారికి.. కెరీర్ బిగినింగ్ లో డాన్స్ మాస్టర్ గా.. కొరియోగ్రఫర్ గా రాకేష్ మాస్టర్ పని చేశారు. ప్రభాస్ కి డాన్స్ నేర్పించింది ఇతనే. ప్రభాస్ కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక రాకేష్ మాస్టర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి స్టార్ కొరియోగ్రఫర్లుగా ఎదిగినవారుచాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన ప్రియశిష్యుల్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రఫర్లు ఉన్నారు.

అంత గొప్ప రాకేష్ మాస్టర్ రాజకీయాలు తట్టుకోలేక.. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడి.. నోటికొచ్చినట్టు మాట్లాడి. కాంట్రవర్సీ కింగ్ అయ్యాడు. స్టార్ హీరోల చేత స్టెప్పులేయించిన రాకేష్ మాస్టర్ కామెడీ మెటీరియల్ ను చేశారు. కాంట్రవర్సీ కావాలన్నీ. ..వివాదాలు చేయాలన్నీ.. రాకేష్ మాస్టర్ వైపు చూసేలా మారింది పరిస్థితి. దాంతో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎన్నో వివాదాలుఫేస్ చేశాడు రాకేష్ మాస్టార్. చివరకు బ్లడ్ మోషన్స్ తో ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి.. మరణించాడు.

ఇదిలా ఉండగా.. రాకేష్ మాస్టర్ మరణంపై రకరకాల వాదనలు వినిపించాయి. ఆయన కుటుంబసభ్యులు రకరకాల అనుమాణాలు వెలిబుచ్చారు. ఆయన కూతురు కొన్ని అనుమానాలు లేవనెత్తగా.. రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చరణ్ మాట్లాడుతూ.. మీడియాపై మండిపడ్డారు. రోజు రోజుకీ మా నాన్న దిగజారిపోవడానికి కారణం మీడియా, అండ్ సోషల్ మీడియా.. అన్నారు.

లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూలకి పిలిచి ఆయన్ని రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడించేవారు. ఇక చాలు. ఆయన పోయారు. ఇక మా జోలికి రాకండి. ‘మీ నాన్నగారు పోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ కష్టాలు ఏంటి? మా నాన్న చనిపోయారు కాబట్టి మేము ఎలా ఏడుస్తున్నాము. ? అంటూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మమ్మల్ని ఇలా వదిలేయండి’ అంటూ రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ మండిపడ్డాడు..

Updated On 27 Jun 2023 11:27 PM GMT
Ehatv

Ehatv

Next Story