మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దుమ్మురేపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌తో చిరు హవా మరింత పెరిగింది. ఫ్యాన్స్‌ కూడా తర్వాతి సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దుమ్మురేపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌తో చిరు హవా మరింత పెరిగింది. ఫ్యాన్స్‌ కూడా తర్వాతి సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన వాల్తేర్‌ వీరయ్య సినిమా 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసిందని టాక్‌! ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో భోళాశంకర్‌లో నటిస్తున్నారు చిరంజీవి. ఇది తమిళంలో సూపర్‌హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్‌. ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్‌ కళ్యాన్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఈ సినిమా మయాళ రీమేక్‌(Remake) అట!

రీమేకులు చాలా ఈజీ! ఏ మలయాళం సినిమానో, తమిళ సినిమానో కొనేసుకుని తెలుగీకరణ చేస్తే దానంత సుఖం ఉండదు. పైగా సేఫ్‌ కూడానూ! అందుకే మోహన్‌లాల్‌, పృథ్విరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్రో డాడి సినిమాను రీమేక్‌ చేయడానికి ప్లాన్‌ చేశారట. ఆల్‌రెడీ కళ్యాన్ కృష్ణ కురసాల కొంత స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారట. హీరో, హీరోయిన్లు సహజీనవం చేస్తుంటారు. హీరోయిన్‌ ప్రెగ్నెట్‌ అవుతుంది. ఈ విషయంలో ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హీరో.

అదే సమయంలో హీరో తల్లి కూడా ప్రెగ్నెంట్‌ అవుతుంది. అప్పుడు కటుంబంలో ఎదురైన పరిస్థితులను వినోదాత్మకంగా చూపించారు. చివర్లో ఎమోషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది తెలుగువారు మలయాళం సినిమాను ఓటీటీలో చూసేశారు. ఆ సినిమాను చిరంజీవి చేస్తున్నారంటే కొంచెం నిరాశ చెందుతున్నారు. మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి నటిస్తుంటే, పృథ్విరాజ్‌ పాత్రలో జొన్నలగడ్డ సిద్ధూ నటిస్తున్నారట. మేకర్స్‌ నుంచి అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది..

Updated On 8 May 2023 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story