యంగ్ హీరోయిన్ కార్తీక పెళ్లి ఘనంగా జరిగింది. 90స్ లో హరోయిన్ గా తెలుగు తెరను ఊపేసిన రాధ కుమార్తె కార్తీక. ఈ యంగ్ స్టార్ పెళ్లి.. రోహిత్ మీనన్ అనే కెరళ వ్యక్తితో త్రివేండ్రంలో జరిగింది. ఆమధ్య తన పెళ్లి అనౌన్స్ మెంట్ ను సడెన్ గా చేసింది కార్తీక. చేతికి ఉంగరం తొడిగి, కాబోయే భర్తను కౌగిలించుకుని ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్(Engagement) చేసుకున్నట్లు ప్రకటించింది. తాను ప్రేమించి రోహిత్ మీనన్ ను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు అప్పుడే అనౌన్స్ చేసింది బ్యూటీ. ఇక తాజాగా రోహిత్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది కార్తీక.

యంగ్ హీరోయిన్ కార్తీక(Karthika Nair) పెళ్ళి ఈరోజు ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) పాటు రాధిక(Radhika), సుహాసినీ(Suhasini) లాంటిసీనియర్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.

యంగ్ హీరోయిన్ కార్తీక పెళ్లి ఘనంగా జరిగింది. 90స్ లో హరోయిన్ గా తెలుగు తెరను ఊపేసిన రాధ కుమార్తె కార్తీక. ఈ యంగ్ స్టార్ పెళ్లి.. రోహిత్ మీనన్ అనే కెరళ వ్యక్తితో త్రివేండ్రంలో జరిగింది. ఆమధ్య తన పెళ్లి అనౌన్స్ మెంట్ ను సడెన్ గా చేసింది కార్తీక. చేతికి ఉంగరం తొడిగి, కాబోయే భర్తను కౌగిలించుకుని ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్(Engagement) చేసుకున్నట్లు ప్రకటించింది. తాను ప్రేమించి రోహిత్ మీనన్ ను త్వరలో పెళ్ళాడబోతున్నట్టు అప్పుడే అనౌన్స్ చేసింది బ్యూటీ. ఇక తాజాగా రోహిత్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది కార్తీక.

నాగచైతన్య(Naga chaithanya) హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కార్తీక. ఒకప్పటి హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనను తాను నిరూపించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేసింది కార్తీక. కాని చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడం.. పెద్దగా అవకాశాల రాకపోవడంతో.. ఎక్కువకాలం ఇండస్ట్రీ లో ఉండటం అసాధ్యం అనుకుంది. అందుకే ఫీల్డ్ మార్చేసింది. పరిశ్రమలో నిలబడలేక పోయింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.

ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా కొన్నిసినిమాలు చేసింది కార్తీక. జీవ హీరోగా నటించిన రంగం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు.

ఇక తాజాగా తాను ప్రేమించిన రోహిత్ ను పెళ్లాడింది బ్యూటీ. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రేవతి, రాధిక.. ఇలా పెళ్ళి మండపంలో సినీ తారలతో వాతావరణం సందడిగా మారింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి

Updated On 20 Nov 2023 8:38 AM GMT
Ehatv

Ehatv

Next Story