మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా సినిమా భోళాశంకర్‌(Bholashankar) షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి ఫేమ్‌ కీర్తి సురేశ్‌(Keerthy Suresh) మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్నారు. హీరో సుశాంత్‌(Sushanth) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా సినిమా భోళాశంకర్‌(Bholashankar) షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి ఫేమ్‌ కీర్తి సురేశ్‌(Keerthy Suresh) మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్నారు. హీరో సుశాంత్‌(Sushanth) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్‌హిట్‌ కావడంతో చిరంజీవిలో సరికొత్త ఎనర్జీ వచ్చింది. అభిమానులు కూడా ఫుల్‌ జోష్‌తో ఉన్నారు. భోళాశంకర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. భోళాశంకర్‌ సినిమాకు సెన్సార్‌బోర్డు యూ/ఏ సర్టిఫికెట్(U/A Cirtificate) ఇచ్చింది. ఆగస్టు 11వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్ని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఒరిజినల్‌ ఫిల్మ్‌ వేదాళం కంటే భోళాశంకర్‌ చాలా బాగుంటుందని కెమెరామెన్‌ డడ్లీ అంటున్నారు. తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా అని, ఫుల్‌ ఫ్యాకేజ్‌ ఆఫ్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. చిరంజీవి చాలా పెర్‌ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్‌ అని, ఆయన దగ్గర నుంచి ఈ రెండు విషయాలు నేర్చుకున్నానని డడ్లీ తెలిపారు. భోళా శంకర్‌లో ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌లో వచ్చే పెద్ద యాక్షన్‌ సీన్‌ తీయడం చాలా కష్టంగా అనిపించిందని, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అన్నీ సమకూర్చారని చెప్పారు.

Updated On 3 Aug 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story