సినిమా విడుదలైన 2వ రోజు నుండే ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ను ఉచితంగా అందించే

అజయ్ దేవగన్ తాజా చిత్రం మైదాన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్ కలెక్షన్స్ ను మాత్రం సొంతం చేసుకుంది. మైదాన్ సినిమాకు ప్రీమియర్లతో సహా భారతదేశంలో దాదాపు 7.25 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఎలాగైనా కలెక్షన్స్ ను పెంచుకోడానికి చిత్ర నిర్మాతలు మైదాన్ సినిమాకు సంబంధించి ఆఫర్ ను వదిలారు. ఒక టిక్కెట్‌ను కొంటే మరొకటి ఉచితంగా పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

సినిమా విడుదలైన 2వ రోజు నుండే ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ను ఉచితంగా అందించే ఆఫర్ ఇచ్చారు. అయితే ప్రేక్షకులు ఈ ఆఫర్‌ని ఉపయోగించుకోవడానికి థియేటర్‌ వైపు మొగ్గు చూపకపోవడంతో చిత్ర నిర్మాతలు షాక్ అవుతూ ఉన్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో ఇండియాలో దాదాపు 30 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దృశ్యం 2తో పెద్ద హిట్ కొట్టిన అజయ్ దేవగన్‌కి ఈ కలెక్షన్స్ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మైదాన్ సినిమా చాలాసార్లు వాయిదా పడింది. అంతేకాకుండా వేసవి కాలం సినిమా విడుదలకు మంచి సమయం అని చిత్ర బృందం భావించింది.. కానీ అదేదీ సినిమా ఫలితాన్ని మార్చలేకపోయాయి. మైదాన్ సినిమా ఫుట్‌బాల్ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా. ఇందులో ప్రియమణి మహిళా ప్రధాన పాత్రలో నటించింది.

Updated On 12 April 2024 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story