ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్(Ram Charan). వరుసగా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ఆయన.. నెక్టస్ సినిమా ఎప్పుడు స్టార్డ్ చేయబోతున్నాడో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్(Ram Charan). వరుసగా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ఆయన.. నెక్టస్ సినిమా ఎప్పుడు స్టార్డ్ చేయబోతున్నాడో తెలుసా..?

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్... సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్(Game changer) చేస్తున్నాడు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా భారీ బడ్డెట్ తో.. దిల్ రాజు(Dilraju) నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలి అని చూస్తున్నారు. దర్శకుడు శంకర్ పక్కా ప్లాన్ తో ఈమూవీని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇది శంకర్ సహా రామ్ చరణ్ కెరీర్ లో కూడా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15వ సినిమా కాగా దీనిపై మంచి హైప్ ఉంది.

ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశాడు. బుచ్చిబాబు సానా(Buchi Babu) తో చరణ్ చేయబోయేది కూడా భారీ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. అయితే అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది. కాని సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న అనుమానం మెగా ప్యాన్స్ లో ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా ఓపెనింగ్ చేస్తాడా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదరు చూస్తున్నారు. ఈక్రమంలో ఈసినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే..?

బుచ్చిబాబు చరణ్ ను చాలా రస్టిక్ లుక్ లో చూపించబోతున్నాడట. రంగస్థలం తరహా ఓ నాచురల్ అండ్ రస్టిక్ డ్రామాను క్రియేట్ చేయబోతున్నాడట బుచ్చిబాబు. కాగా ఈ సినిమాపై కూడా గట్టి క్రేజ్ ఉంది. అయితే ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని అయితే జరుపుకుంటుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంకి ఏ ఆర్ రెహమాన్(AR Rehman) సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో నిర్మాత వెంకట సతీష్ కిలారు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా బిజీలో ఉన్నాడు రామ్ చరణ్. ఈమూవీ త్వరలో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. కియారా అద్వాని హీరోయిన్ కాగా.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమాలో అంజలీ, శ్రీకాంత్, జయరాం. సునిల్ లాంటి స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.

Updated On 19 Aug 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story