ఇచ్చిన జోష్ తో దూసుకుపోతున్నాడు బాలీవుడ్(Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). 1000 కోట్ల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను కాపాడిన ఈసినిమా తరువాత ప్రస్తుతం జవాన్ సినిమాత్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ సీనియర్ స్టార్. బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్(Pathaan)ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓవర్ ఆల్ గా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము రేపాడు షారుఖ్. అంతే కాదు అసలే కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ ను పఠాన్ సక్సెస్ తో..

ఇచ్చిన జోష్ తో దూసుకుపోతున్నాడు బాలీవుడ్(Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). 1000 కోట్ల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను కాపాడిన ఈసినిమా తరువాత ప్రస్తుతం జవాన్ సినిమాత్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ సీనియర్ స్టార్.

బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్(Pathaan)ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓవర్ ఆల్ గా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము రేపాడు షారుఖ్. అంతే కాదు అసలే కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ ను పఠాన్ సక్సెస్ తో.. రియల్ హీరోగా కాపాడాడు షారుఖ్. చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో.. కంమ్ బ్యాక్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తలెత్తుకుని నిలబడ్డాడు. బాలీవుడ్ నెంబర్ వన్ అని మరోసారి అనిపించుకున్నాడు.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ డైరెక్టర్ కావడంతో ఈ మూవీ పై సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాపై క్రేజ్ కూడా అంతకంతకు పెరుగుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా చేసుకుంటున్న ఈమూవీకి సబంధించిన రెండు వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. దాంతో అంతా షాక్ అయ్యారు. చేస్తున్నాడు.

అయితే ఈ వీడియోలో లీక్ అయిన సీన్స్ చాలా ఇంపార్టెంట్.. సినిమాను మలుపు తిప్పే సన్నివేశాలు కావడంతో.. షారుఖ్ వెంటనే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి తొలిగించాలి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేశాడు. షారుఖ్ ఖాన్ పిటిషన్ ని విచారించిన కోర్ట్.. ఆ వీడియో క్లిప్స్ ని సోషల్ నెట్ వర్క్స్ నుంచి వెంటనే తొలిగించాలి అంటూ సైబర్ పోలీస్ లను ఆదేశించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలిగించారు.

నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు, ప్రియమణి, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దీపికా పడుకోణె, సంజయ్ దత్, విజయ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జూన్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. ఇక మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Updated On 27 April 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story