సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన రాబోయే చిత్రం జవాన్(Jawan) విడుదలకు ముందు తిరుపతిలోని(Tirupati) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. షారుఖ్‌తో పాటు కూతురు సుహానా(Suhasana), ఆయ‌న‌ మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. షారుఖ్ ఖాన్, సుహానా ఇద్దరూ సాంప్ర‌దాయ‌ దుస్తులను ధరించారు. షారుఖ్ ఖాన్ వెంట శ్రీవారిని ద‌ర్శించుకున్న వాళ్లలో జవాన్ హీరోయిన్‌ నయనతార(Nayanthara), ఆమె భర్త విఘ్నేష్ శివన్(Vignesh shivan) కూడా ఉన్నారు. సెప్టెంబర్ 7న జవాన్ విడుదల కానుంది.

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన రాబోయే చిత్రం జవాన్(Jawan) విడుదలకు ముందు తిరుపతిలోని(Tirupati) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. షారుఖ్‌తో పాటు కూతురు సుహానా(Suhasana), ఆయ‌న‌ మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. షారుఖ్ ఖాన్, సుహానా ఇద్దరూ సాంప్ర‌దాయ‌ దుస్తులను ధరించారు. షారుఖ్ ఖాన్ వెంట శ్రీవారిని ద‌ర్శించుకున్న వాళ్లలో జవాన్ హీరోయిన్‌ నయనతార(Nayanthara), ఆమె భర్త విఘ్నేష్ శివన్(Vignesh shivan) కూడా ఉన్నారు. సెప్టెంబర్ 7న జవాన్ విడుదల కానుంది.

ఇటీవ‌ల షారుఖ్ ఖాన్ వైష్ణో దేవి మాతాని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. వైష్ణో దేవి మందిరం బోర్డు అధికారులు, కొందరు పోలీసులు, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిని వీడియో క్లిప్‌లో చూడవచ్చు.

షారుఖ్ ​​షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. గత వారం ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం చెన్నైకి వెళ్లాడు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం దుబాయ్ వెళ్లాడు. అనంత‌రం వైష్ణో దేవి ఆల‌యానికి, ఇప్పుడు తిరుప‌తి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

షారుఖ్ ప్ర‌స్తుతం జవాన్‌తో పాటు రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ డుంకీలో కూడా నటిస్తున్నాడు. తాప్సీ పన్ను ఈ సినిమాలో షారుఖ్ జోడీ. డుంకీ కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది. దాదాపు 4 సంవత్సరాల పాటు సిల్వ‌ర్‌ స్క్రీన్ కు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్.. పఠాన్ హిట్‌తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కూడా న‌టించారు.

Updated On 5 Sep 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story