అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది.

అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. బాలీవుడ్‌(Bollywood) హీరో జాన్‌ అబ్రహంకు(john Abraham) కూడా ఇలాగే కోపం వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన వేదా(Veda) సినిమా ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో శార్వరి, అభిషేక్‌ బెనర్జీ, తమన్నాలు(Tamannah) ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఓ విలేకరి 'ఇందులో కొత్తేముంది? మీరు ఎప్పుడూ చేసే యాక్షన్‌ మూవీలాఏ ఉంది' అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో జాన్‌ అబ్రహంకు సర్రుమని కాలింది. నువ్వు సినిమా చూశావా అంటూ ఆ విలేకరిని ప్రశ్నించాడు. దాంతో పాటు క్లాస్‌ కూడా పీకాడు. 'నీవన్ని చెత్త ప్రశ్నలు. ఇలాంటివి అడిగేవారందరూ తెలివితక్కువవారని నేను అంటున్నానా? లేదు కదా! ఇదో డిఫరెంట్‌ సినిమా అని మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్‌ సినిమాల కంటే ఇందులో నా నటన కొత్తగా ఉంటుంది. మీరు ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మీకేమీ తెలియదనుకోవాలి. ముందు సినిమా చూసి మాట్లాడండి. అంతేకానీ ఇలా ముందే తప్పుడు ప్రచారం చేయకండి.. నేను టాలరేట్ చేయను' అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు జాన్‌ అబ్రహం. నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది.

Eha Tv

Eha Tv

Next Story