ఏమంటా బాస్ పార్టీ అంటూ టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిందో.. ఊర్వసీ రౌటేలకు బాగా కలిసి వచ్చింది. మన టాలీవుడ్ జనాలు ఆమె వెంట పరుగులు పెడుతున్నారు. ఈక్రమంలో ఆమె డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ ఐటమ్ సాంగ్‌ తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా.

ఈమధ్య వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వసీ రౌటేలా.. అంతే కాదు.. పాటు ఆమె డిమాండ్ చేస్తున్న నెంబర్ విని కళ్లు తిరుగుతున్నాయట మేకర్స్ కు.

ఏమంటా బాస్ పార్టీ అంటూ టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిందో.. ఊర్వసీ రౌటేలకు బాగా కలిసి వచ్చింది. మన టాలీవుడ్ జనాలు ఆమె వెంట పరుగులు పెడుతున్నారు. ఈక్రమంలో ఆమె డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ ఐటమ్ సాంగ్‌ తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. ఆ పాట బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

వచ్చిన ఆఫర్లు ను ఉపయోగించుకోవడం మాట అటు ఉంచితే.. ఆమె అడిగే రెమ్యూనరేషన్ గురించి విని మేకర్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఊర్వశీ టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాల్లో మూడు స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. అయితే, అవన్నీ స్పెషల్ సాంగ్స్ కావడం విశేషం. అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌ సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేసిన ఊర్వశీ.. పోతినేని రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలోనూ ఓ పాట చేసింది.

ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమాలోనూ ప్రత్యేక పాట కోసం ఆమెను తీసుకున్నారు. ఇలా వరుసగా ఆఫర్లు రావడంతో డిమాండ్ తగ్గట్టుగా తన రెమ్యునరేషన్‌ ను ఊర్వశీ అమాంతం పెంచిందని టాక్. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

పూజాహెగ్డే, రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రత్యేక పాట కోసం ఐదు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే కాస్త తక్కువే కావడంతో ఊర్వశీకి మూడు, నాలుగు నిమిషాల కోసం మూడు కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట.

Updated On 8 Jun 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story