రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) నెమ్మదిగా ఊపందుకుంటోంది. ప్రేక్షకుల్లో షో పట్ల ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్ల సందర్భంగా రచ్చ జరిగింది. పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth) నామినేషన్‌ మధ్యలో ఉండగానే సోమవారం ఎపిసోడ్‌ ఎండయ్యింది. మంగళవారం అక్కడ్నుంచే షో మొదలయ్యింది. మొదట తేజ, గౌతమ్‌, దామిని, అమర్‌దీప్‌, ప్రియాంక, షకీలా నామినేట్‌ చేశారు. కంటెస్టెంట్లందరూ తననే నామినేట్‌ చేసే సరికి పల్లవి ప్రశాంత్‌ కంట్రోల్‌ చేసుకోలేకపోయారు.

రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) నెమ్మదిగా ఊపందుకుంటోంది. ప్రేక్షకుల్లో షో పట్ల ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్ల సందర్భంగా రచ్చ జరిగింది. పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth) నామినేషన్‌ మధ్యలో ఉండగానే సోమవారం ఎపిసోడ్‌ ఎండయ్యింది. మంగళవారం అక్కడ్నుంచే షో మొదలయ్యింది. మొదట తేజ, గౌతమ్‌, దామిని, అమర్‌దీప్‌, ప్రియాంక, షకీలా నామినేట్‌ చేశారు. కంటెస్టెంట్లందరూ తననే నామినేట్‌ చేసే సరికి పల్లవి ప్రశాంత్‌ కంట్రోల్‌ చేసుకోలేకపోయారు. ఆట ఇప్పుడే మొదలయ్యిందని, బయట తన వాళ్లు ఉన్నారని, వారే చూసుకుంటారని తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరు సెటప్‌ చేసుకునే వస్తారన్నది నిజం. కాకపోతే ప్రశాంత్‌ ఇలా చెప్పడమే కాసింత అతిగా అనిపించింది. ప్రశాంత్‌ను నామినేట్‌ చేసిన రతిక(Rithika) అందుకు కారణం చెప్పారు. అవకాశం వచ్చే వరకు ఓ ప్రశాంత్‌, వచ్చిన తర్వాత మరో ప్రశాంత్‌ కనిపిస్తున్నాడని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రతిక. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిస్తే డబ్బులేమీ తీసుకోకుండా ఉండగలవా అని అడిగితే అస్సలు తీసుకోను అని ప్రశాంత్‌ బదులిచ్చాడు. ఇదంతా ప్రేక్షకులకు అసహనం తెచ్చింది. మరోవైపు నామినేషన్‌లో భాగంగా ప్రేమిస్తున్నానని తీనో చెప్పానా అంటూ తనతో ప్రశాంత్‌ అనడం రతికకు నచ్చలేదు. ప్రశాంత్‌ అసలు రూపం ఇప్పడు బయటపడిందని రతిక చెప్పుకొచ్చారు. తర్వాత గౌతమ్ బాక్సులోకి వచ్చారు. ప్రశాంత్ నామినేట్ చేశారు. అటు పిమ్మట శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. ప్రియాంక చెప్పిన రీజన్ నువ్వు కూడా చెప్పావ్, నన్ను నామినేట్ చేశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానని అన్నాడు. యాక్టివిటీ రూమ్‌లో శివాజీ, శోభాశెట్టి బాగానే ఉన్నారు గానీ బయటకొచ్చిన తర్వాత గట్టిగా వాదించుకున్నారు. మాట తెరిస్తే కంటెంట్, కంటెంట్ అంటున్నారు మీరు అని శోభాశెట్టి ఆయనకు కౌంటర్ విసిరారు. 'ఇంప్రెస్ టాస్కులో ఓడిపోయానని బిగ్‌బాస్ నాకు చెప్పలేదు కదా.. నా దగ్గరకు వచ్చి మీరు ఇబ్బంది పెట్టారు కదా' అని శివాజీకి శోభాశెట్టి కౌంటర్ వేశారు. రీజన్ లేకపోయినా సరే కావాలని నామినేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే షకీలాను ప్రిన్స్‌ నామినేట్‌ చేశారు. శుభశ్రీ, ప్రియాకను ఎవరూ నామినేట్‌ చేయలేదు. తర్వాత రతిక రాగా.. ఆమెని గౌతమ్, తేజ నామినేట్ చేశారు. వీఐబీ బెడ్ రూమ్‌లో గొడవపడి, అదే బెడ్‌పై పడుకోవడం తనకు నచ్చలేదని గౌతమ్ కారణం చెప్పారు. తనని బొండాం అని పిలవడం నచ్చలేదని తేజ అన్నాడు. మరి తనని చెంపపై కొట్టడం కరెక్ట్ కాదు కదా అని రతిక వాదించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ బాగా గొడవపడ్డారు. మరోవైపు రతికని నామినేట్ చేస్తూ.. ప్రశాంత్‌ని తేజ టీజ్ చేశాడు. అమర్‌దీప్‌ని ప్రిన్స్ నామినేట్ చేశాడు. అయితే హౌసులో ప్రతిఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటే శివాజీ మాత్రం ఒక్కరినే చేశారు.

Updated On 13 Sep 2023 6:48 AM GMT
Ehatv

Ehatv

Next Story