తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌(Bigg Boss) సీజన్‌-7లో పాల్గొన్న వారి గురించి ఇప్పుడు పరిచయం చేయడం అంత బాగోదు. ఎందుకంటే హౌస్‌లో పార్టిసిపెంట్ల గురించి అందరికీ తెలుసు కాబట్టి. అందులో పాల్గొన్నవారందరూ ఏదో రకంగా పాపులరయ్యారు. కొందరికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొందరేమో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. ఇందులో ముఖ్యంగా రతికా రోజ్‌(Rathika Rose) ఓ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకున్నారు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌(Bigg Boss) సీజన్‌-7లో పాల్గొన్న వారి గురించి ఇప్పుడు పరిచయం చేయడం అంత బాగోదు. ఎందుకంటే హౌస్‌లో పార్టిసిపెంట్ల గురించి అందరికీ తెలుసు కాబట్టి. అందులో పాల్గొన్నవారందరూ ఏదో రకంగా పాపులరయ్యారు. కొందరికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొందరేమో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. ఇందులో ముఖ్యంగా రతికా రోజ్‌(Rathika Rose) ఓ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకున్నారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్‌ తొలివారంలోనే కామన్‌మ్యాన్‌గా వెళ్లిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందనే గుసగుసలు కూడా వినిపించాయి. కాకపోతే చాలా తొందరగానే హౌస్‌ నుంచి వచ్చేశారు. త్వరగా ఎలిమినేట్ అయ్యారు. ఆశ్యర్యంగా మళ్లీ కొద్ది రోజులకే బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికీ పెద్దగా టాస్కులు ఆడకపోవడంతో రెండోసారి కూడా ఎలిమినేట్‌ అయ్యారు. అప్పట్నుంచి రతికా రోజ్‌ ఏ షోలోనూ కనిపించలేదు. సోషల్‌ మీడియాలో(Social media) మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఏదో ఒక పోస్టు పెడుతుంటారు. లేటెస్ట్‌గా ఆమె పెట్టిన పోస్టే షాకింగ్‌గా ఉంది. ఓ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌తో కొత్త జర్నీ స్టార్ట్‌ అయ్యిందంటూ రాసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్‌తో(amardeep) కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘కొంత మంది ఫ్రెండ్స్‌ చాలా విలువైన వారు. మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎక్కువ ప్రదేశాలు చూపించడానికి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రతి రోజూ గొడవలు పడిన వీరిద్దరు ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేయడమేమిటని అంటున్నారు.

Updated On 20 Jan 2024 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story