బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో(Telugu Bigg Boss 7 ) కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. బిగ్‌బాస్‌ పెడుతున్న చిత్రవిచిత్ర టాస్కులను తట్టుకుని నిలబడుతున్నారు. ఇప్పటికే పవరస్త్ర కోసం ఎంపిక చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్‌ చేసిన వారికి కూడా టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్‌. మూడో పవరాస్త్ర కోసం ప్రిన్స్‌ యావర్‌, అమర్‌దీప్‌, శోభాషెట్టిలను బిగ్‌బాస్‌ ఎంపిక చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులో విజయం సాధించి తాను కంటెండర్‌గా పోటీ చేసేందుకు అర్హుడినేనని ప్రూవ్‌ చేసుకున్నాడు ప్రిన్స్‌(Prince). ఈ రోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో(Telugu Bigg Boss 7 ) కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. బిగ్‌బాస్‌ పెడుతున్న చిత్రవిచిత్ర టాస్కులను తట్టుకుని నిలబడుతున్నారు. ఇప్పటికే పవరస్త్ర కోసం ఎంపిక చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్‌ చేసిన వారికి కూడా టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్‌. మూడో పవరాస్త్ర కోసం ప్రిన్స్‌ యావర్‌, అమర్‌దీప్‌, శోభాషెట్టిలను బిగ్‌బాస్‌ ఎంపిక చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులో విజయం సాధించి తాను కంటెండర్‌గా పోటీ చేసేందుకు అర్హుడినేనని ప్రూవ్‌ చేసుకున్నాడు ప్రిన్స్‌(Prince). ఈ రోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదట శోభా షెట్టిని పిలిచాడు బిగ్‌బాస్‌. శోభాషెట్టికి అసలు కారమే అలవాటు లేదు. అలాంటి శోభాషెట్టి ముందు బాగా కారమున్న చికెన్‌ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్‌ ఇచ్చాడు. కారమున్నా సరే 27 ముక్కలను తినేసింది శోభాషెట్టి. ఆమె కంటెండర్‌గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్‌ చేసిన పల్లవి ప్రశాంత్‌, శుభశ్రీ రాయగురు, గౌతమ్‌ కృష్ణలకు అదే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తక్కువ సమయంలో 28 చికెన్‌ ముక్కలు తినాలని చెబుతూ సందీప్‌ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్‌ 28 ముక్కలు తిని బెల్ కొట్టాడు. అయితే అప్పటి వరకు గమ్మున ఉన్న సంచాలక్‌ తర్వాత మాత్రం ఒక పీస్‌ కొద్దిగా వదిలేశావంటూ ఓ నంబర్‌ తగ్గించాడు. 27 ముక్కలే తిన్నట్టు చెప్పాడు. శోభాషెట్టి(Shobha Shetty) కంటే ఎక్కువ తినలేకపోవడంతో ఆమెనే కంటెండర్‌గా ఎంపిక చేశాడు బిగ్‌బాస్‌. శివాజీ(Shivaji) పవరాస్త్రను దొంగిలించిన అమర్‌దీప్‌(Amardeep) చివరకు దాన్ని తిరిగి ఇచ్చేశాడు. తర్వాత బిగ్‌బాస్‌ అసలు సిసలైన ఫిట్టింగ్‌ పెట్టాడు. అమర్‌దీప్‌ను గుండు చేయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్‌ చేసిన ప్రియాంక బేబీకట్‌ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? కుదరదుగాక కుదరదు అని అనుకున్న అమర్‌దీప్‌ వణికిపోయాడు. ప్రియాంక మాత్రం ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్‌కట్‌ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్‌కట్‌కు సిద్ధమయ్యింది. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ప్రియాంక తర్వాత మాత్రం సంబరపడింది. ఎప్పట్నుంచో ఇలా చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకోవాలనుకున్నానని, ఇప్పుడు చాలా క్యూట్‌గా ఉన్నానని మురిసిపోయింది. ఇప్పుడు వపరస్త్రను ఎవరు గెల్చుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ప్రిన్స్‌ను ఓడించి శోభా షెట్టి, ప్రియాంకలలో ఎవరో ఒకరు పవరస్త్రను గెల్చుకుంటారా? ఏమో చూడాలి..

Updated On 22 Sep 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story