బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) రసకందాయంలో పడింది. శనివారం ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున వచ్చాడు. అందరినీ నవ్వించాడు. చేసిన పనులను మెచ్చుకున్నాడు. మరోవైపు కొందరిపై అక్షింతలు వేశాడు. చివరలో నామినేషన్స్‌ గురించి చెప్పి కంటెస్టెంట్లను భయపెట్టాడు. బిగ్‌బాస్‌లో 13వ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మాయాఅస్త్ర విషయంపై రతిక(Rathika) తనను సపోర్ట్ చేయడంపై యవర్‌(Yuvar) మాట్లాడాడు. ఆమెపై గౌరవం పెరిగిందన్నాడు

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) రసకందాయంలో పడింది. శనివారం ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున వచ్చాడు. అందరినీ నవ్వించాడు. చేసిన పనులను మెచ్చుకున్నాడు. మరోవైపు కొందరిపై అక్షింతలు వేశాడు. చివరలో నామినేషన్స్‌ గురించి చెప్పి కంటెస్టెంట్లను భయపెట్టాడు. బిగ్‌బాస్‌లో 13వ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మాయాఅస్త్ర విషయంపై రతిక(Rathika) తనను సపోర్ట్ చేయడంపై యవర్‌(Yuvar) మాట్లాడాడు. ఆమెపై గౌరవం పెరిగిందన్నాడు. తనకు అన్యాయం జరగడంపై మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ శుభశ్రీతో మాట్లాడాడు. డర్టీ పాలిటిక్స్‌ జరుగుతున్నాయని, ఇది కరెక్ట్ కాదని కెమెరాను చూస్తూ చెప్పాడు. కాసేపటికి బెడ్‌రూమ్‌లో అందరూ ఉన్న సమయంలో ప్రిన్స్‌-గౌతమ్‌ మధ్య షకీలా రాజీ కుదిర్చింది.

శుక్రవారం జరిగిందంతా చూసిన నాగార్జున శనివారం కంటెస్టెంట్లతో మాట్లాడాడు. గతవారం ఆడియెన్స్‌ చెప్పారని, ఈసారి మాత్రం కింగ్స్‌ మీటర్‌తో తానే చెబుతానని నాగార్జున అన్నాడు. అలా ఒక్కో కంటెస్టెంట్స్ ఈ వారం ఎక్కడ ఒప్పు చేశారో ఎక్కడ తప్పు చేశారో చెప్పుకొచ్చాడు. అలాగే రెండో పవరాస్త్రను గెల్చుకున్నది శివాజీ అని ప్రకటించారు. బిగ్‌బాస్‌ అరిచే గేమ్‌లో శివాజీకి అత్యధికంగా 11 పాయింట్లు వచ్చాయి. గేమ్‌, టీమ్‌ను లీడ్‌ చేసే విషయంలో శివాజీని సూపర్‌ అని మెచ్చుకున్నాడు నాగార్జున. తలుపు తీయరా సామీ బయటకు వెళ్లిపోతా అని బిగ్‌బాస్‌తో పదేపదే అనడంపై నాగార్జున ఓ రేంజ్‌లో కౌంటర్లు వేశాడు.

అది సరైంది కాదన్నాడు. అమర్‌దీప్‌ కూడా బాగానే ఆడాడని చెప్పాడు. ప్రశాంత్‌ నామినేషన్‌ సమయంలో చెప్పిన పాయింట్‌ మాత్రం కరెక్ట్‌ కాదన్నాడు నాగార్జున. షకీలాకు కొన్ని సూచనలు చేశాడు. వయసుతో శరీరానికి సంబంధం లేదని, వయసుకు తగినట్టు కాదు, వయసుకు మించి ఆడాలని నాగార్జున ఆమెతో చెప్పాడు. సందీప్‌ను బాగా ఆడుతావని ప్రశంసించాడు. ఇంకా బాగా ఆడాలని శుభశ్రీ, ప్రియాంకలకు చెప్పాడు. అయితే రైతుబిడ్డ ప్రశాంత్‌కి మాత్రం గట్టిగా కౌంటర్స్ పడ్డాయి. ఒక మొక్కని చూసుకోలేనివాడు రైతుబిడ్డా? అని నాగార్జున అనేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. బిగ్‌బాస్‌ని అడిగి మరో మొక్క పంపిస్తా.

ఈసారి మాత్రం మొక్క ఎండిపోతే నామినేషన్స్‌లో అందరూ చెప్పింది నిజమని తాను నమ్ముతా అంటూ ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు నాగార్జున. ప్రిన్స్ యవర్‌తో మాట్లాడిన నాగ్.. నీ అరుపులతో మేం డిసప్పాయింట్ అయ్యామన్నాడు. 'బాగా ఆడావ్. ఎక్సప్రెస్ చేయ్ కానీ అరవాల్సిన అవసరం లేదు, అన్యాయానికి అరిస్తే న్యాయం జరగదు. నీకు రివార్డ్ దొరకదు' అని చెప్పాడు నాగార్జున. గౌతమ్ స్టెరాయిడ్స్ అని సైగ చేయడంపై మాట్లాడిన నాగార్జున అక్కడే గౌతమ్‌తో యవర్‌కి సారీ చెప్పించాడు.ఏ గేమ్ లోనూ గెలవలేదు, వ్యక్తిగతంగానూ గెలుచుకోలేకపోయావ్.

ఇంప్రూవ్ యువర్ గేమ్ అని గౌతమ్‌కు చిన్నపాటి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. మిగతావాళ్లలో శుభశ్రీ, దామిని, శోభాశెట్టి, తేజ సరిగా ఆడటం లేదంటూ హెచ్చరించాడు. రతికకి మాత్రం గట్టిగానే ఇచ్చాడు. 'టీమ్ గేమ్ అంటే టీమ్ గేమ్ ఆడాలి, ఒక్కటే పాయింట్ పట్టుకుని మొండితనం కరెక్ట్ కాదు, బఫూన్ అంటే ఏంటో తెలుసా?' అని అన్నాడు. ఆట ఆడు.. మనుషులతో ఆడుకోవద్దని చెప్పి కూల్ చేశాడు. ఇకపోతే రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న శివాజీ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. అమర్‌దీప్ కూడా సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఏడుగురు అంటే ప్రశాంత్, షకీలా, గౌతమ్, యావర్, తేజ, శోభాశెట్టి, రతిక ఇంకా డేంజర్ లో ఉన్నారని చెప్పాడు.

Updated On 17 Sep 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story