బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో(Bigg Boss Season 7) ఉత్కంఠభరితంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Bouse House) నుంచి మొదటి వ్యక్తి బయటకు వచ్చారు. ఎవరు హౌస్‌ నుంచి బయటకు వెళతారో అందరూ ఊహించినట్టే జరిగింది కానీ చివరలో ఇచ్చిన ట్వీస్టే ఎవరూ అనుకోలేదు. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా ప్రియాంకతో(Priyanka) పోటీపడి ఫైనల్‌ టాస్కులో సందీప్‌ పవర్‌ అస్త్ర(Sandeep Pawar astra) గెలుచుకున్నారు. అదూ టాపిక్‌తో మళ్లీ ఆదివారం ఎపిసోడ్‌ ప్రారంభమయ్యింది. ఇది గెలుచుకున్నందుకుగానూ వీఐపీ గదిలో ఉండే ఛాన్స్‌ సందీప్‌కు బిగ్‌బాస్‌ కల్పించినట్టు హోస్ట్ నాగార్జున(Nagarjuna) చెప్పారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో(Bigg Boss Season 7) ఉత్కంఠభరితంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Bouse House) నుంచి మొదటి వ్యక్తి బయటకు వచ్చారు. ఎవరు హౌస్‌ నుంచి బయటకు వెళతారో అందరూ ఊహించినట్టే జరిగింది కానీ చివరలో ఇచ్చిన ట్వీస్టే ఎవరూ అనుకోలేదు. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా ప్రియాంకతో(Priyanka) పోటీపడి ఫైనల్‌ టాస్కులో సందీప్‌ పవర్‌ అస్త్ర(Sandeep Pawar astra) గెలుచుకున్నారు. అదూ టాపిక్‌తో మళ్లీ ఆదివారం ఎపిసోడ్‌ ప్రారంభమయ్యింది. ఇది గెలుచుకున్నందుకుగానూ వీఐపీ గదిలో ఉండే ఛాన్స్‌ సందీప్‌కు బిగ్‌బాస్‌ కల్పించినట్టు హోస్ట్ నాగార్జున(Nagarjuna) చెప్పారు. అలాగే పవర్‌ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయనంటే కుదరదని చెప్పి, బ్యాటరీ ఒకటి ఉంటుందని షాకిచ్చారు. ఎప్పటికప్పుడు దీన్ని చెక్‌ చేసుకుంటూ ఉండాలని నాగార్జున అన్నారు. ఇందులో రెడ్‌మార్క్‌ వస్తే డేంజర్‌లోకి వెళ్లిపోతావని నాగ్‌ చిన్నపాటి హెచ్చరిక కూడా చేశారు. ఆదివారం కాబట్టి బిగ్‌బాస్‌ హౌస్‌లో అమ్మాయిలతో అబ్బాయిలకు యాక్టివిటీ గదిలో ఓ గేమ్‌ పెట్టారు. ఇందులో భాగంగా అమ్మాయిలు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటే అబ్బాయిలలో ఒకరు పాము ఆకారంలో ఉన్న కర్రతో కళ్లకు గంతలు కట్టుకుని గజ్జెల చప్పుడు బట్టి వాళ్లను టచ్‌ చేయాల్సి ఉంటుంది. తేజ, అమర్‌దీప్‌, శోభాశెట్టి, ఎవరినీ టచ్‌ చేయలేకపోయారు. శుభశ్రీ మాత్రం నలుగురిని టచ్‌ చేసింది. మొత్తంగా ఈ ఆటలో అమ్మాయిలదే పైచేయి అయ్యింది. ఇక్కడి వరకు సరదాగానే సాగింది. ఎలిమినేషన్‌ టాపిక్‌ వచ్చేసరికి హౌస్‌లో కాసింత నిశ్శబ్దం ఆవరించింది. చిన్నసైజు శవపేటికల్లాంటి బాక్సులో పూలు ఉంటే సేఫ్, అస్థిపంజరం ఉంటే డేంజర్ అని చెప్పారు. ఇందులో రతిక, శోభాశెట్టి సేఫ్‌గా బయటపడ్డారు. కిరణ్‌, ప్రశాంత్‌, దామిని, ప్రిన్స్‌, గౌతమ్‌, షకీలా మాత్రం డేంజర్ జోన్‌లో ఉండిపోయారు. మరోవైపు లివ్ ఇన్ ద మూమెంట్ అని చిన్న ఫన్ టాస్క్ పెట్టగా.. అందరూ గుర్తుంచుకోదగ్గ మూమెంట్, మరిచిపోవాలనుకున్న మూమెంట్‌ని షేర్ చేసుకున్నారు. మరో స్టేజీలో ప్రశాంత్, గౌతమ్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత మరో దశలో షకీలా, దామిని ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఫైనల్‌గా యాక్టివిటీ గదిలోకి ప్రిన్స్, కిరణ్ వెళ్లారు. ఎవరిపై అయితే రెడ్ స్పాట్‌లైట్‌ పడుతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పగా.. ప్రిన్స్‌పై గ్రీన్ లైట్ పడటంతో అతడు బతికిపోయాడు. కిరణ్(Kiran).. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. హౌస్‌ నుంచి స్టేజ్‌పైకి వెళ్లిన కిరణ్‌, వెళుతూ వెళుతూ అందరికీ షాకిచ్చారు. వాళ్ల అసలు స్వరూపాలు బయటపెట్టారు. ప్రిన్స్, షకీలా, శివాజీ, శుభశ్రీ సీదా క్యారెక్టర్స్ అని చెప్పింది. ప్రశాంత్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్‌ ఎక్కువని, రతికకు ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉందని, శోభాశెట్టి చాలా సెల్ఫిష్ అని, టేస్టీ తేజ చాలా కన్నింగ్ ఫెల్లో అని అతడితో అందరూ జాగ్రత్తగా ఉండాలని కిరణ్‌ చెప్పారు. అయితే తన ఫ్రెండ్ కిరణ్ హౌస్ నుంచి వెళ్లిపోయేసరికి షకీలా(shakila) కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated On 11 Sep 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story