సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ బాలయ్య మార్కులోనే సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ బాబీ బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేశాడు. దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా పెంచారట. ఈసారి పాన్ ఇండియాను టచ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇటు బాలయ్య కూడా రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఈ సినిమాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో కుర్ర హీరోలకు భయంపుట్టుస్తున్నాడు. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య. అంతే కాదు నెక్టస్ మూవీ కూడా పక్కాగా ప్లాన్ చేశాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు చేసే డైరెక్టర్ బాబీతో తన 109వ సినిమాను సెట్స్ ఎక్కించాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది.

సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ బాలయ్య మార్కులోనే సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ బాబీ బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేశాడు. దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా పెంచారట. ఈసారి పాన్ ఇండియాను టచ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇటు బాలయ్య కూడా రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఈ సినిమాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు టీమ్. అయితే ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించాయి. అందులో త్రిషపేరు కూడా వచ్చింది. అయితే తాజగా ఈమూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారన్న వార్త హైలెట్ అవుతోంది. అయితే త్రిష (Trisha) పేరు ఖరారయినట్టే అంటున్నాుమేకర్స్.. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పేరు వినిపిస్తోంది. గతంలో బాలయ్యతో కలిసి త్రిష 'లయన్' సినిమా చేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈసినిమా తరువాత బాలయ్యతో సినిమాకు స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. బాలయ్య మాత్రంయంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలి అని చూస్తున్నాడట. అటు పూరి కూడా బాలయ్య కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి నెక్ట్స్ నండమూరి నట సింహం ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం దిల్ ఖుష్ అవుతున్నారు.

Updated On 28 Nov 2023 8:20 AM GMT
Ehatv

Ehatv

Next Story