బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన మాస్ యాక్షన్ తో పాటు.. కన్నీరు తెప్పించే సిస్టర్ సెంటిమెంట్స్‌ ను కలగలిపి అభిమానుల‌ను అల‌రించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది వీరసింహారెడ్డి. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ మార్క్ ను సునాయాసంగా రాబ‌ట్టింది. నందమూరి అభిమానులతో పాటు.. కామన్ ఆడియనస్ ను కూడా అలరించిన ఈ సినిమా తాజాగా ఓ ఘనతను సాధించింది.

బాలయ్య బాబు వరుస సినిమాలతో పాటు... వరుస సక్సెస్ లు కూడా అందుకుంటున్నాడు. అంతే కాదువరుస రికార్డ్ లుకూడా బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన వీరసింహారెడ్డి.. రేర్ ఫీట్ ను సాధించింది.

నంద‌మూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, శృతి హాసన్(Shruthi Hassan), హానీరోజ్(Honey Rose) హీరోయిన్స్ గా న‌టించిన సినిమా వీరసింహారెడ్డి(VeeraSimha Reddy). రవితేజ తో క్రాక్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలో.. సంక్రాంతి కానుగా రిలీజ్ అయ్యింది సినిమా..

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన మాస్ యాక్షన్ తో పాటు.. కన్నీరు తెప్పించే సిస్టర్ సెంటిమెంట్స్‌ ను కలగలిపి అభిమానుల‌ను అల‌రించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది వీరసింహారెడ్డి. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ మార్క్ ను సునాయాసంగా రాబ‌ట్టింది. నందమూరి అభిమానులతో పాటు.. కామన్ ఆడియనస్ ను కూడా అలరించిన ఈ సినిమా తాజాగా ఓ ఘనతను సాధించింది.

వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నుంచి అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఈసినిమా ఓ ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఓ థియేట‌ర్‌లో 200 రోజులు ప‌రుగును పూర్తి చేసుకుంది. జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఏప్రిల్ 21తో 100 రోజుల‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ శ‌క్ర‌వారంతో 200 రోజుల ప‌రుగును పూర్తి చేసుకుంది. క‌ర్నూల్‌ అలూరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ థియేట‌ర్‌లో ఈ మైలురాయిని చేరుకుంది.

Updated On 30 July 2023 12:09 AM GMT
Ehatv

Ehatv

Next Story