ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వ్యాక్తుల్లో బండి సంజయ్ కూడా ఒకరు. తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఛీఫ్ గా ఉన్న బండి(Bndi Sanjay)ని పేపర్ లీక్ కేసు(Paper Leake Case)లో అరెస్ట్ చేయగా..ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈక్రమంలో.. ఈ అరస్ట్ వల్ల తన ఇంట్లో బలగం సీన్ రిపీట్(Balagam Scene Repea) అయ్యిందంటూ చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం..? బలగం సినిమా(Balagam Movie) ప్రేక్షకుల మనసుల్లో బలంగా నటుకుపోయింది. మన హిందు సంస్కృతి సంప్రాయాలు అద్దం పడుతూ.. ఇంట్లో వాళ్ళు చనిపోతే.. ఇష్టమైనవాళ్ళు అంతా కలిసి కర్మల సమయంలో పోయిన వారికి ఇష్టమైన ఆహారం వండిపెడతారు.

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వ్యాక్తుల్లో బండి సంజయ్ కూడా ఒకరు. తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఛీఫ్ గా ఉన్న బండి(Bndi Sanjay)ని పేపర్ లీక్ కేసు(Paper Leake Case)లో అరెస్ట్ చేయగా..ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈక్రమంలో.. ఈ అరస్ట్ వల్ల తన ఇంట్లో బలగం సీన్ రిపీట్(Balagam Scene Repea) అయ్యిందంటూ చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం..?

బలగం సినిమా(Balagam Movie) ప్రేక్షకుల మనసుల్లో బలంగా నటుకుపోయింది. మన హిందు సంస్కృతి సంప్రాయాలు అద్దం పడుతూ.. ఇంట్లో వాళ్ళు చనిపోతే.. ఇష్టమైనవాళ్ళు అంతా కలిసి కర్మల సమయంలో పోయిన వారికి ఇష్టమైన ఆహారం వండిపెడతారు. ఈక్రమంలో పోయిన వాళ్ళు కాకిరూపంలో వచ్చి వాటిని తింటారని పెద్దల నమ్మకం. ఈ క్రమంలో.. బలగం సినిమాలో కూడా ఇలానే ఇంట్లో ఘనంగా కార్యక్రమాలు చేసి.. రెండు సార్లు పెట్టినా.. ఇండి పెద్ద కాకిరూపంలో వస్తాడు కాని.. పెట్టిన ఆహారం తినదు. దాంతో ఇంట్లో ఉన్న గొడవలు మర్చిపోయి..అంతా కలిసి మెలిసి పెట్టిన ఆహారాన్ని చనిపోయిన ఆ పెద్దాయన కాకిరూపంలో వచ్చి తింటాడు. ఇది బలగంలో సీన్..

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. బండి సంజయ్ ఇంట్లో కూడా ఇదే సీన్ రిపిట్ అయ్యిందంట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రీసెంట్ గా కరీంనగర్ లో తన అత్త చనిపోతే.. కార్యక్రమాలకోసం వెళ్ళాడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఇంట్లో ఉండగానే.. రాత్రికి రాత్రి.. ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు.. దాంతో సంజయ్ అత్తమ్మ చిట్ల విజయమ్మ చనిపోయిన తరువాత కర్మల టైమ్ లో పెట్టిన ముద్దను కాకిముట్టలేదన్నారు సంజయ్. తనను అమ్మ తర్వాత.. అత్మమ్మ కన్నకొడుకులా చూసుకుందని అన్నారు. తాను రాకపోవడంతో పిండం ముట్టలేదని బాధపడ్డారు సంజయ్.

కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే.. పక్షికి ముద్ద పెట్టడానికి వచ్చినా అంటూ వ్యాఖ్యానించారు. ఇంటి ముంగిట చనిపోయిన మా అత్తమ్మ ఫోటో ఉందని, ఆమె తింటుందని అన్నారు. ఆమె చనిపోతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నామీద ఉందని తెలిసినా పోలీసులు కనికరం చూపలేదని ఫైర్ అయ్యారు సంజయ్. ఇక పేపర్ లీక్ ఘటనకు సబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

Updated On 7 April 2023 11:27 PM GMT
Ehatv

Ehatv

Next Story