గతేడాది భారీ హిట్ అయిన సినిమాల్లో 'బేబీ' సినిమా ఒకటి. ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించారు.

గతేడాది భారీ హిట్ అయిన సినిమాల్లో 'బేబీ' సినిమా ఒకటి. ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించారు. కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. ఈ సినిమా విడుదలైనప్పుడు ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ ఫిర్యాదు చేశాడు.

బేబీ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్‌ శ్రీరామ్‌ తెలిపాడు. అయితే తనను ఏ మాత్రం సంప్రదించకుండా సినిమాను ఓకె చేశారని ఆరోపించారు. వారు కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ కోరినట్లు శ్రీరామ్‌ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడిందని అన్నాడు. 2015లో 'కన్నా ప్లీజ్‌' టైటిల్‌తో శ్రీరామ్‌ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్‌ పెట్టుకున్నాడని తెలిపారు. డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారని శిరిన్‌ శ్రీరామ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated On 10 Feb 2024 1:05 AM GMT
Yagnik

Yagnik

Next Story